📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Terror Attack Reel : భోపాల్-ఇండోర్ రైలులో యువకుడిపై దాడి

Author Icon By Divya Vani M
Updated: April 29, 2025 • 5:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భోపాల్ నుండి ఇండోర్ వెళ్ళే ప్యాసింజర్ రైలులో ఓ యువకుడిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 23 ఏళ్ల యువకుడు మొబైల్ ఫోన్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన రీల్స్ చూస్తున్నాడనే కారణంతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి, దూషించారని ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.​జీఆర్పీ టీఐ రష్మీ పాటిదార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై బీఎన్ఎస్ సెక్షన్లు 118(1) (ప్రమాదకర ఆయుధాలతో ఉద్దేశపూర్వకంగా గాయపరచడం), 296 (దూషించడం), 351 (నేరపూరిత బెదిరింపు) తదితర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Terror Attack Reel భోపాల్ ఇండోర్ రైలులో యువకుడిపై దాడి

బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించామని, ఘటనకు సంబంధించిన వీడియో, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె వివరించారు.బాధితుడి కథనం ప్రకారం, శనివారం రాత్రి అతను షుజాల్‌పూర్ నుండి భోపాల్-ఇండోర్ ప్యాసింజర్ రైలు ఎక్కాడు. రైలు దేవాస్ స్టేషన్ దాటిన తర్వాత, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తన వద్దకు వచ్చి, పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన రీల్స్ చూడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రీల్స్ చూస్తూ తమ వైపు చూస్తున్నావని, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావని ఆ ఇద్దరు తనతో వాగ్వాదానికి దిగినట్లు తెలిపాడు.”ఈ క్రమంలోనే వారి మధ్య గొడవ జరిగి అది దాడికి దారితీసింది” అని పోలీస్ అధికారి తెలిపారు. నిందితులు తమది ఇండోర్‌లోని చందన్ నగర్ ప్రాంతమని చెప్పినట్లు బాధితుడు పేర్కొన్నాడని ఆమె అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని అధికారి రష్మీ పాటిదార్ ధృవీకరించారు.

Read Also : Khawaja Asif : ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యల పై భారత్ చర్యలు

Bhopal Indore Passenger Attack GRP Investigation Indian Railway Security Pahalgam Reels Controversy Pahalgam Terror Attack Fallout Train Incident India Youth Attacked on Train

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.