📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Terrorist Attacks: భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్- పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

Author Icon By Vanipushpa
Updated: March 19, 2026 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌ (India)లో ఉగ్రవాద దాడులు జరిపేందుకు కుట్ర పన్నుతున్న ఓ ముఠా పట్టుబడింది. పుణ్యక్షేత్రాలు, కీలక ప్రదేశాల ఫొటోలు, వీడియోలు, లొకేషన్ వివరాలు సరిహద్దు అవతల ఉన్న పాకిస్థాన్(Pakistan) హ్యాండ్లర్లకు సోషల్ మీడియా ద్వారా పంపుతున్నారనే ఆరోపణలపై పాక్ ఆధారిత గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌కు చెందిన ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అధికారులు ఉగ్రకోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

Read Also: TTD: తిరుమలలో 80 లగేజీ కౌంటర్లు అందుబాటులోకి!

Terrorist Attacks: Plan for terrorist attacks in India – Two suspects in police custody

ఐబీ నుంచి పోలీసులకు వచ్చిన సమాచారం

ఉత్తర్​ప్రదేశ్​ హాపుడ్‌లోని మొఘల్ గార్డెన్‌లో ఉన్న ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. అరెస్టు అయిన యువకులు ఒక ఆలయం, దిల్లీ కాలనీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, లొకేషన్స్‌ను సోషల్ మీడియా ద్వారా ఒక పాకిస్థానీ గ్యాంగ్‌కు పంపుతున్నారని ఐబీ నుంచి తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ మేరకు తాము ఇద్దర్ని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఇటీవలే (మార్చి 15న) గాజియాబాద్‌లోని కౌశాంబి పోలీసులు ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 50 ప్రదేశాలలో రహస్య సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి వారు ప్రణాళికలు వేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కెమెరాలలో ఒకటి హరియాణాలోని సోనిపత్ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 3 దగ్గర ఉన్న హై వోల్టేజ్ విద్యుత్ లైన్‌ స్తంభానికి నిందితులు అమర్చారు. ఈ క్రమంలో ఐబీ, ఎన్ఐఏ, ఇండియన్ రైల్వేస్ అధికారుల పర్యవేక్షణలో గాజియాబాద్ పోలీసులు బుధవారం (మార్చి 18) ఆ స్తంభం నుంచి రహస్య సీసీటీవీ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Counter-terrorism operation Indian Police News Intelligence Bureau Update Security Alert 2026 suspects arrested Telugu News Paper Telugu News Today Terror Attack Plot India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.