📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Telugu News: YCP-ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి వైసీపీ మద్దతు

Author Icon By Pooja
Updated: August 21, 2025 • 5:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YCP: ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు తమ మద్దతు ఉంటుందని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేతలు తమను సంప్రదించారని, పార్టీ లోపల చర్చించిన తర్వాత సానుకూలంగా స్పందించామని చెప్పారు.వైసీపీ నిర్మాణం మొదటినుంచి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకున్న పార్టీగా బొత్స గుర్తు చేశారు. గతంలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ(Vice Presidential election) ఎన్డీయే అభ్యర్థినే మద్దతు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న వైసీపీ రాజకీయ ధోరణి అని చెప్పారు. పార్టీ ఎప్పుడూ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

Telugu News: YCP-ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి వైసీపీ మద్దతు

దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ మద్దతు

పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక కీలక బిల్లులకు వైసీపీ (YCP)మద్దతు తెలిపిందని బొత్స వివరించారు. రాజకీయ లాభ నష్టాలకంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న ఉద్దేశంతోనే కేంద్రానికి మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. నంబర్ గేమ్ అనే అస్తవ్యస్త పరిస్థితులు ఉండకుండా చూసేందుకు తమ మద్దతు కీలకమవుతుందని చెప్పారు.ఈ తాజా నిర్ణయంతో ఎన్డీయే అభ్యర్థికి గెలుపు అవకాశాలు మరింత బలపడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ తన రాజకీయం నాటకీయతలకు దూరంగా, స్థిరమైన విధానంతో ముందుకు సాగుతుందనడానికి ఇదే నిదర్శనమని పరిగణిస్తున్నారు.

మద్దతు ఇవ్వడానికి కారణం ఏమిటి?

దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ స్థిరతను కాపాడడమే ఉద్దేశమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఇది వైసీపీ తీసుకున్న మొదటి నిర్ణయమా ఎన్డీయేకు మద్దతుగా?
కాదు. గతంలో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ఇచ్చింది, అలాగే కేంద్ర బిల్లులకు పార్లమెంటులో మద్దతు తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-pak-pakistan-is-in-a-deep-economic-crisis/national/533915/

Breaking News in Telugu Google News in Telugu IndianPolitics Latest News in Telugu NDA VicePresidentElection2025 YSRCP YSRCPLatestNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.