Rains: ఉత్తరాఖండ్లో కుంభవృష్టి విరుచుకుపడింది. రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాల(Heavy rains) కారణంగా సాధారణ జీవనం పూర్తిగా స్థంభించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోగా, మరికొందరు అదృశ్యమయ్యారు. అనేక ఇళ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.
చమోలీ జిల్లా దేవల్ మండలం మోపటాలో చోటుచేసుకున్న ఘటనలో తారా సింగ్, ఆయన భార్య కనిపించకుండా పోయారని అధికారులు వెల్లడించారు. అదే ప్రాంతంలో విక్రమ్ సింగ్ దంపతులు గాయపడగా, వారి పశువుల కొట్టం కూలిపోవడంతో 15–20 పశువులు చనిపోయాయి.
రుద్రప్రయాగ్లో వరద ఉధృతి – ఆలయాలు నీటమునుగు
రుద్రప్రయాగ్లో(Rudraprayag) పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. అలకనంద, మందాకిని నదులు సంగమ ప్రదేశంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కేదార్నాథ్ లోయలోని లవారా గ్రామంలో వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోగా, రుద్రప్రయాగ్లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయం పూర్తిగా జలమయం అయింది. వరదనీరు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
ఈ ఘటనలపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని, తాను నిరంతరం ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. బసుకేదార్ తహసీల్లో నాలుగు ఇళ్లు కొట్టుకుపోయినప్పటికీ నివాసితులందరినీ రక్షించామనే విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ ప్రతీక్ జైన్ ధృవీకరించారు. మరోవైపు, హల్ద్వానీ–భీమ్తాల్ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. భద్రతా కారణాల వల్ల రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలీ, హరిద్వార్, పితోరాగఢ్ జిల్లాల్లో శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ఉత్తరాఖండ్లో ఏ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి?
రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో పరిస్థితి అత్యంత తీవ్రమైనదిగా ఉంది.
ఈ ఘటనలో ప్రాణనష్టం ఎలా ఉంది?
చమోలీ జిల్లాలో ఒక దంపతులు గల్లంతయ్యారు, కొందరు గాయపడ్డారు. పలు పశువులు మృతి చెందాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: