Crime News: పెళ్లి ఎంతో పవిత్రమైనబంధం. ప్రపంచదేశాలకు సైతం మన వివాహ వ్యవస్థ గొప్ప ఆదర్శం. పెళ్లి అనేది ఇద్దరు మనుషుల మధ్య ఒప్పందం కాదు రెండు మనసుల కలయిక. జీవితాంతం కలిసి జీవించేందుకు చేసుకునే చట్టపరమైన ఒప్పందంతో పాటు ఎన్నో బాధ్యతలు, ఆనందాలు దాగి ఉన్నాయి. ఇంతటి విలువైన బంధాన్ని ఆధునిక పెళ్లిలు పెటాకులుగా మారిపోతున్నాయి. ప్రేమించేందుకు అమ్మాయి కావాలి, తన కోరిక తీర్చుకునేందుకు ఒంటరిగా ఉండే మహిళ కావాలి. కానీ పెళ్లి చేసుకోమంటే మాత్రం చంపేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో(Uttar Pradesh) జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చంపి ముక్కలు చేశారు
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో ఒక బావిలో ఒక మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ మాజీ ప్రధాన్ సంజయ్ పటేల్ ఓ వితంతు మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఆమె పదేపదే పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయడంతో అతను విసుగు చెందాడు. దీంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. సంజయ్ పటేల్ మేనల్లుడు అయిన సందీప్ పటేల్ తో కలిసి ఝాన్సీలోని కిషోర్పరా గ్రామంలో ఆ మహిళను హత్యమార్చి, ఆపై మృతదేహాన్ని ఏడు ముక్కలుగా నరికి, సంచుల్లో నింపి బావిలో, వంతెన వద్ద పడేశారు. బావి నుంచి దుర్వాసనతో వెలుగులో సంఘటన
అక్కడికి ఈనెల 13వ తేదీన తన పొలాలను పరిశీలించిన రైతు బావి నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదు చేరుకున్న పోలీసులు తనికీలు చేపట్టారు. నీటిలో తేలియాడుతున్న రెండు బస్తాలలో ఒక మహిళ శరీరభాగాలు కనిపించాయి. దీంతో పోలీసులకు ఆమె ఎవరో కనిపెట్టడం సవాలుగా
మారింది. దీంతో ఎనిమిది బృందాలుగా ఏర్పడిన పోలీసులు కేసును ఎట్టకేలకు ఛేదించారు.
పెళ్లి డిమాండ్ చేయడం వల్లే హత్య చేశారు
బాధితురాలు మాజీ ప్రధాన్ పై నిరంతరం పెళ్లి చేసుకోమని డిమాండ్ చేయడం వల్లే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. దాదాపు వందమంది గ్రామస్తులనటు పోలీసులు విచారించారు. రెండువందలకు పైగా సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. ఆమె ఝూన్సీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న టికమడ్కు చెందిన రచనా యాదవ్ అనే వితంతువుగా తేలింది. ఆగస్టు 8న నిందితులు చన గొంతు కోసి చంపి, ఆమె మృతదేహాన్ని బావికి తరలించి, సాక్ష్యాలను దాచడానికి ముక్కలు ముక్కలు చేసినట్లుగా దర్యాప్తుతేలింది. ఈ ఘటనలో మాజీ గ్రామపెద్ద, అతని మేనల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. తనకు జీవితాంతం తోడుగా ఉంటాడని ఎంతో నమ్మిన రచనా తన సర్వం సమర్పించుకుంది. అతనితో కలిసి ఏడడుగులు వేయాలని ఆశించింది. కానీ చివరికి ఆ బంధమే తనను అంతం చేస్తుందని ఆమె ఊహించలేక పోయింది. ప్రేమ పేరుతో మోసం చేసే ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువగా జరుగుతుండడం విషాదకరం.
హత్య వెనక కారణం ఏమిటి?
బాధితురాలు మాజీ గ్రామ ప్రధాన్ సంజయ్ పటేల్ను పదేపదే పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయడంతో, అతను విసిగి హత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు కేసును ఎలా ఛేదించారు?
స్థానిక రైతు బావి నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించడంతో కేసు బయటపడింది. పోలీసులు వందమంది గ్రామస్తులను విచారించడంతో పాటు 200 కంటే ఎక్కువ సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి నిందితులను అరెస్టు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: