మొబైల్ ఫోన్లు వచ్చిన కొత్తలో మనకు కాల్ చేసేది ఎవరో తెలుసుకోవడం ఒక పెద్ద సవాలుగా ఉండేది. ఆ లోటును భర్తీ చేస్తూ ట్రూ కాలర్ (Truecaller) వంటి థర్డ్ పార్టీ యాప్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇవి ప్రజలు తమ ఫోన్లలో సేవ్ చేసుకున్న పేర్ల ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి, ఇందులో 100% ఖచ్చితత్వం ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పోలీస్, సిబిఐ, లేదా ప్రభుత్వ అధికారులుగా పేర్లు మార్చుకుని సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ(Telecom Ministry) విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది.
Read also: Janagama: 20 ఓట్ల తేడాతో చరిత్ర సృష్టించిన 3 అడుగుల తిరుపతమ్మ

ట్రూ కాలర్ పరిమితులు మరియు పెరిగిన సైబర్ మోసాలు
Telecom Ministry: ప్రస్తుతం వాడుకలో ఉన్న కాలర్ ఐడి వ్యవస్థల్లో లోపాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రూ కాలర్లో ఎవరైనా తమ పేరును సులభంగా మార్చుకోవచ్చు. నేరగాళ్లు కావాలనే ‘ఐపిఎస్ ఆఫీసర్’ లేదా ‘డిజిటల్ అరెస్ట్'(Digital Arrest) వంటి పేర్లతో రిజిస్టర్ చేసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు అందిస్తున్న ఇన్-బిల్ట్ ఐడిలలో కూడా యూజర్ తనకు నచ్చిన పేరును డిస్ప్లే చేసుకునే వీలుండటంతో జెన్యూనిటీ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నకిలీ పేర్ల వల్ల వెరిఫైడ్ టిక్ మార్క్ ఉన్నప్పటికీ ప్రజలు మోసపోతున్నారు.
CNAP విధానం: ఆధార్ పేరుతోనే కాలర్ ఐడెంటిటీ
సైబర్ నేరాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం CNAP (Calling Name Presentation) అనే కొత్త విధానాన్ని తీసుకువస్తోంది. దీని ప్రకారం, ఎవరైనా మీకు ఫోన్ చేసినప్పుడు వారి మొబైల్ నంబర్తో పాటు, సదరు సిమ్ కార్డ్ కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో అదే స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనివల్ల అవతలి వ్యక్తి తన పేరును మార్చుకోవడానికి లేదా దాచుకోవడానికి అవకాశం ఉండదు.
- అమలు: 2026 మార్చి నుండి ఈ విధానం అమల్లోకి రానుంది.
- సాఫ్ట్వేర్ అప్డేట్: దీనికోసం అవసరమైన మార్పులు చేయాలని ఇప్పటికే అన్ని టెలికాం ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని మొబైల్స్లో ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది.
- ప్రైవసీ ఆప్షన్: ఒకవేళ తమ పేరు కనిపించకూడదని భావించే యూజర్ల కోసం దీన్ని ఆఫ్ చేసుకునే (Privacy Toggle) సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించనుంది. దీనివల్ల వ్యక్తిగత గోప్యతతో పాటు భద్రత కూడా పెరుగుతుంది.
CNAP అంటే ఏమిటి?
కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్. ఇది ఆధార్ ఆధారిత కాలర్ ఐడి వ్యవస్థ.
ఈ విధానం ఎప్పటి నుండి అమలు అవుతుంది?
2026 మార్చి నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: