బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి సంక్షోభం
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, కాంగ్రెస్ (congress) మరియు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మధ్య సీట్ల పంపకంపై తలెత్తిన వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. రెండు పార్టీలు తమ తమ స్థానాలపై రాజీ పడకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కొందరు అభ్యర్థులకు గుర్తులు కేటాయించి, తర్వాత వాటిని అర్ధరాత్రి వెనక్కి తీసుకోవడం గందరగోళానికి దారితీసింది. ఢిల్లీలో తేజస్వి యాదవ్,(Tejaswi yadav) కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య జరిగిన సమావేశం ఫలితం లేకుండానే ముగిసింది. తేజస్వి కూటమి కొనసాగించాలనే ఉత్సాహం చూపకపోవడంతో, కాంగ్రెస్ 61-63 స్థానాలు మరియు ముఖ్య నియోజకవర్గాలు వదులుకోలేమని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ పార్టీ నేతలకు “గట్టిగా బేరసారాలు చేయండి” అని సూచించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ చర్చల తర్వాత తేజస్వి యాదవ్ ఖర్గే లేదా రాహుల్ను కలవకుండానే పాట్నాకు వెళ్లడం, ఆర్జేడీ అభ్యర్థుల సింబల్స్ వెనక్కి తీసుకోవడం వివాదాన్ని మరింత పెంచింది.
Read also: రాష్ట్ర బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు: కూనంనేని
వీఐపీ నేత సహానీ వైఖరి కొత్త తలనొప్పి

కూటమిలోని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముఖేశ్ సహానీ చర్యలు కూడా సమస్యగా మారాయి. కాంగ్రెస్ వర్గాలు ఆయనను నమ్మదగినవాడిగా పరిగణించడం లేదని తెలిపారు. తేజస్వి యాదవ్ (Tejaswi yadav) ప్రకారం, సహానీ ఇప్పటికే కాంగ్రెస్ వాటాలోని 10 స్థానాలకు సింబల్స్ ఇచ్చి గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలో బీహార్ కాంగ్రెస్ నేతలు ఖర్గే జోక్యం కోరగా, ఆయన తేజస్వి యాదవ్తో నేరుగా చర్చించి పరిష్కారం కనుక్కోవాలని సూచించారు. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీచేసి 19 గెలవగా, ఆర్జేడీ 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11న ఎన్నికలు జరగగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: