రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav) ఇవాళ మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన కూటమి గురించి ఆయన ఏమీ ప్రస్తావించలేదు. నామినేషన్ల ఫైలింగ్ ముగిసిందని, ప్రచారం మొదలుపెట్టాలన్నారు. బీహారీ ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, ప్రస్తుత డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయినట్లు పేర్కొన్నారు. నిరుద్యోగం, వలసలతో బీహారీలు బాధపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ఎజెండాను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. జీవికా దీదీల నెలవారి జీతాన్ని 30 వేలు చేయనున్నట్లు చెప్పారు.
Read Also: Atlas: కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్కు గట్టి పోటీ

మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడగానే జీవికా దీదీలను పర్మనెంట్ ఉద్యోగులుగా ప్రకటించనున్నట్లు చెప్పారు. అంగన్వాడీల జీతాలను 30 వేలకు పెంచడం చిన్న విషయం కాదన్నారు. ఇదో ఎన్నో ఏళ్ల డిమాండ్ అని తెలిపారు. జీవికా దీదీలకు అదనపు అలవెన్స్ రెండు వేలతో పాటు ఆ క్యాడర్కు 5 లక్షల బీమా కల్పించనున్నట్లు చెప్పారు. సీట్ల పంపకం విషయంలో మహాఘట్బంధన్లో ఎటువంటి విబేధాలు లేవని, గురువారం అన్ని సమాధానాలు దొరుకుతాయని తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)అన్నారు.
తేజస్వి యాదవ్ ప్రారంభ జీవితం మరియు విద్య?
యాదవ్ బీహార్లోని గోపాల్గంజ్లో రబ్రీ దేవి మరియు లాలూ ప్రసాద్ యాదవ్ దంపతులకు జన్మించారు , ఇద్దరూ బీహార్ మాజీ ముఖ్యమంత్రులు . అతను తొమ్మిది మంది తోబుట్టువులలో చిన్నవాడు మరియు ఏడుగురు సోదరీమణులు మరియు ఒక సోదరుడు ఉన్నారు. అతను పాట్నాలో పాఠశాలకు వెళ్లాడు మరియు తరువాత, తన పెద్ద సోదరి మిసా భారతితో కలిసి ఢిల్లీకి వెళ్లాడు . ఢిల్లీలో, అతను వసంత్ విహార్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక తరగతుల కోసం 5వ తరగతి వరకు చదివాడు.
తేజస్వి యాదవ్ వ్యక్తిగత జీవితం?
డిసెంబర్ 9, 2021న, యాదవ్ తన చిరకాల స్నేహితురాలు రాజశ్రీ యాదవ్ (రాచెల్ గోడిన్హో)ను వివాహం చేసుకున్నాడు. ఆమె హర్యానాలోని రేవారీకి చెందినది మరియు చిన్నప్పటి నుండి ఢిల్లీలో నివసిస్తోంది . ఆమె మరియు యాదవ్ న్యూఢిల్లీలోని ఆర్కె పురంలోని డిపిఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: