📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Breaking News – TET : తెలంగాణ లోని టీచర్లకు టెట్ తిప్పలు

Author Icon By Sudheer
Updated: November 17, 2025 • 7:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ లో ప్రకటించిన టెట్ సిలబస్ పై రాష్ట్రవ్యాప్తంగా టీచర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ బోధనా రంగానికి సంబంధం లేని సబ్జెక్టుల నుంచి పెద్దమొత్తంలో ప్రశ్నలు రావడం ఆందోళనకు గురిచేస్తోందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా 10–15 సంవత్సరాల క్రితమే చదువు వదిలేసిన, ఉద్యోగంలో బిజీగా ఉన్న టీచర్లు మళ్లీ ఆ సబ్జెక్టులు చదవడం ప్రాయోగికంగా సాధ్యంకాదని వాదిస్తున్నారు. గతంలో వారి ట్రైనింగ్, పోస్టుల ఆధారంగా సిలబస్‌ను రూపొందించగా, ఇప్పుడు సాధారణీకరించిన పద్ధతితో అందరికీ ఒకే సిలబస్ పెట్టడంతో గందరగోళం పెరిగింది.

Latest News: South China: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు

ఇంగ్లిష్, బయాలజీ, ఫిజిక్స్ వంటి ప్రత్యేక సబ్జెక్టుల అధ్యాపకులు మరో సమస్యను ప్రస్తావిస్తున్నారు. వారి అసలు సబ్జెక్టుకు వర్తించే ప్రశ్నలు కేవలం 12 మార్కులు మాత్రమే ఉండగా, మిగతా 90 మార్కులు పూర్తిగా సంబంధంలేని సబ్జెక్టుల నుంచి రావడం అన్యాయమని చెబుతున్నారు. ఈ అసమాన్తా కారణంగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టమవుతుందని భావిస్తున్నారు. శిక్షణ పొందిన తమ అసలు ప్రత్యేకతను ప్రశ్నించే విధంగా సిలబస్ రూపకల్పన ఉందని వారు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సబ్జెక్ట్ నిష్ణాతులు కూడా పాస్ అవడమే సవాల్‌గా మారుతుందని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సిలబస్‌ను సబ్జెక్టుల వారీగా విభజించి, ఆయా టీచర్లు బోధించే సబ్జెక్టుకు అనుగుణంగా టెట్ నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. విద్యా నాణ్యత పెంచాలన్న ఉద్దేశ్యం మంచిదైనా, ప్రస్తుత సిలబస్ టీచర్ల వృత్తిపర నైపుణ్యాన్ని పట్టించుకోకుండా రూపొందించబడిందని విమర్శిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పునర్విమర్శ చేసి, సంబంధిత సంఘాలతో చర్చించి, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సిలబస్‌లో మార్పులు చేయాలని టీచర్లు కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం వరకు పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతాయని సూచిస్తున్నారు.

Bihar Google News in Telugu Latest News in Telugu Nitish Kumar nitish kumar resign

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.