TCS Ai Strategy : K Krithivasan కృత్రిమ మేధ (AI) ప్రభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Tata Consultancy Services (టీసీఎస్) ఏఐ సాంకేతికతను భయంగా కాకుండా అవకాశంగా చూస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ కారణంగా పరిశ్రమల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, వాటికి అనుగుణంగా సంస్థ విధానాలు, వ్యాపార నమూనాలను మార్చుకుంటున్నామని తెలిపారు.
సంస్థ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ, ఏఐ వినియోగం వల్ల స్వల్పకాలంలో ఆదాయంపై ప్రభావం పడినా దీర్ఘకాలంలో ఇది ఉత్పాదకత, ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని అన్నారు. ఉద్యోగులు ఏఐ టూల్స్ను విస్తృతంగా వినియోగించాలని సంస్థ ప్రోత్సహిస్తున్నదని చెప్పారు.
Read Also: Census 2027 India: జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల
యువ నిపుణులు ఏఐ వినియోగంలో వేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ, సీనియర్ స్థాయి ఉద్యోగులు మరింతగా నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంస్థలోని సుమారు ఆరు లక్షల మంది ఉద్యోగులు ఏఐ నైపుణ్యాలను సంపాదించాలనే లక్ష్యంతో శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు.
కొత్త సాంకేతికతల వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయనే భయాన్ని తాము పంచుకోవడం లేదని, మారుతున్న సాంకేతిక ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధి ద్వారా కొత్త అవకాశాలు సృష్టించవచ్చని కృతివాసన్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: