తమిళనాడు (TamilNadu) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ‘శ్రీలంక తమిళుల పౌరసత్వం’ అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, రాష్ట్రంలో నివసిస్తున్న సుమారు 89,000 మంది శ్రీలంక తమిళుల పౌరసత్వ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
Read Also: Kashi: మహాశివరాత్రి వేళ విశ్వేశ్వరుడికి ప్రత్యేక కానుకలు
వేలాది కుటుంబాలు నేటికీ పౌరసత్వం లేక అగమ్యగోచర స్థితిలో ఉన్నాయి
1983 నుంచి శ్రీలంకలో జరిగిన జాతి హింస కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమిళనాడుకు వచ్చిన వేలాది కుటుంబాలు నేటికీ పౌరసత్వం లేక అగమ్యగోచర స్థితిలో ఉన్నాయని తమిళనాడు (TamilNadu) సీఎం ఎంకే స్టాలిన్ వివరించారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి రాసిన తన లేఖలో.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 89,000 మందిలో దాదాపు 40 శాతం మంది ఇక్కడే జన్మించారని చెప్పారు.
చాలా కుటుంబాలు 30 నుంచి 40 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాయని పేర్కొన్నారు. 2015 జనవరి 9కి ముందు భారత్కు వచ్చిన వారిని ‘అక్రమ వలసదారులు’గా పరిగణించవద్దని.. వారికి పాస్పోర్ట్, వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా పౌరసత్వ దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు జిల్లా స్థాయి అధికారులకు తగిన అధికారాలు కట్టబెట్టాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: