📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Tamil Nadu: జాబ్ స్కామ్.. రంగంలోకి ఈడీ!

Author Icon By Aanusha
Updated: October 30, 2025 • 9:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు (Tamil Nadu) లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో సంచలన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌,, నీటి సరఫరా విభాగంలో ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)  గుర్తించింది. మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు సందర్భంగా ఈ “క్యాష్‌ ఫర్‌ జాబ్‌” స్కామ్‌ బయటపడింది.

Read Also: Vande Mataram: వందేమాతరం 150వ వార్షికోత్సవం – చరిత్రకు నమస్కారం!

అభ్యర్థుల నుంచి ఒక్కో ఉద్యోగానికి రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు లంచాలు తీసుకున్నట్లు ఆధారాలు లభించాయని ఈడీ (ED) తెలిపింది. ఈ నేపథ్యంలో, ఈడీ తమిళనాడు (Tamil Nadu) పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాసి, దర్యాప్తు వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈ కుంభకోణం వెనుక కొందరు శక్తిమంతమైన రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉన్నారని ఈడీ ఆరోపిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటి సరఫరా విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ ఇంజినీర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వంటి పోస్టుల భర్తీకి 2024లో ప్రక్రియ ప్రారంభమైంది.

ఆగస్టు నెలలో స్వయంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

సుమారు 1.12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షల అనంతరం 2,538 మందిని ఎంపిక చేశారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో స్వయంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వీరికి నియామక పత్రాలు అందజేశారు.అయితే, ఈ నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది.

దాదాపు 150 మంది అభ్యర్థులకు అనుకూలంగా పరీక్షల్లో రిగ్గింగ్‌కు పాల్పడినట్లు పేర్కొంది. ఇందుకోసం అభ్యర్థుల నుంచి రూ. 25-35 లక్షల చొప్పున వసూలు చేశారని తెలిపింది. ఈ కుంభకోణంలో రాష్ట్రంలోని కీలక రాజకీయ నాయకులు, కొన్ని సంస్థల ప్రమేయం ఉందని ఈడీ అనుమానిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో

ఈ ఆరోపణలకు సంబంధించి 232 పేజీల ఆధారాలను తమిళనాడు పోలీసులకు సమర్పించింది. ఈ పరీక్షను నిర్వహించిన అన్నా యూనివర్సిటీపైనా దర్యాప్తు జరపాలని కోరినట్లు సమాచారం.ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఈ వార్తా కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయితే, ఈ ఆరోపణలపై తమిళనాడు ప్రభుత్వం గానీ, సీఎం స్టాలిన్ (CM Stalin) గానీ ఇప్పటివరకు స్పందించలేదు.

వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కుంభకోణం అధికార డీఎంకే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

cash for job DMK government ED investigation latest news Tamil Nadu job scam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.