
తమిళనాడు (Tamil Nadu) లోని, చెన్నై నగరంలో ఎథిరాజ్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమం హృదయాలను తాకింది. ఆ వేడుకలో తమిళ నటుడు పార్థీబన్ చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. చెత్తలో దొరికిన బంగారాన్ని ఎలాంటి ఆశ లేకుండా యజమానికి తిరిగి అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ఆయన ఘనంగా సత్కరించారు. ఆమెకు, కిరీటాన్ని అలంకరించి, ఆమె కాళ్లు మొక్కి గౌరవించారు.
Read Also: MRK Panneerselvam: హిందీపై మంత్రి షాకింగ్ కామెంట్స్
పారిశుద్ధ విధుల లో భాగంగా
సంపద కంటే వ్యక్తిత్వమే గొప్పదని మరోసారి నిరూపించిన ఈ ఘటన మానవత్వానికి చక్కటి ఉదాహరణగా నిలిచింది.టి నగర్లో పారిశుద్ధ విధులు నిర్వహిస్తుండగా పద్మకు రోడ్డుపై ఒక సంచి కనిపించింది. అది విప్పి చూడగా అందులో 45 సవరల బంగారు ఆభరణాలు కనిపించాయి. పై అధికారులకు ఈ సంగతి తెలియజేసి ఆ ఆభరణాల సంచిని పాండీ బజార్పోలీసులకు అప్పగించింది. వారు దర్యాప్తు చేసి అసలు యజమానికి ఆ నగలు అప్పగించగలిగారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: