హోటల్ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన తాజ్ జీవీకే(TajGVK) హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం జరిగిన లావాదేవీలో కంపెనీ ప్రమోటర్ వాటాదారైన షాలిని భూపాల్ పెద్ద మొత్తంలో ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నారు. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL) వద్ద ఉన్న వాటాను ఆమె కొనుగోలు చేయడంతో కార్పొరేట్ వర్గాల్లో ఈ డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also: RailwayRules: రాత్రి రైలు ప్రయాణంలో టికెట్ లేకపోతే ఏమవుతుంది? TTE దింపేస్తారా?
రూ.592 కోట్ల డీల్తో యాజమాన్య నిర్మాణంలో స్పష్టమైన మార్పు
మొత్తం 1.60 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరు రూ.370(TajGVK) ధరకు కొనుగోలు చేయగా, ఈ లావాదేవీ విలువ సుమారు రూ.592 కోట్లకు చేరింది. ఈ కొనుగోలు అనంతరం కంపెనీలో షాలిని భూపాల్ వాటా 25.52 శాతానికి పెరిగింది. ఈ షేర్ బదిలీ మొత్తం ప్రమోటర్ గ్రూపు సంస్థల మధ్యే జరిగినట్లు యాజమాన్యం వెల్లడించింది. అందువల్ల దీనిని అంతర్గత వాటాల బదిలీగా పరిగణిస్తున్నారు.
ఈ తాజా పరిణామంతో సంస్థకు సంబంధించిన పలు పాత ఒప్పందాలు ముగిసినట్లు ప్రకటించారు. 2011లో కుదిరిన వాటాదారుల ఒప్పందం, అలాగే 2007 నాటి ట్రేడ్మార్క్ లైసెన్స్ ఒప్పందాలు ఇక చెల్లుబాటు కావని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రమోటర్లు, ఐహెచ్సీఎల్ మధ్య అధికారికంగా ముగింపు పత్రంపై సంతకాలు జరిగినట్లు తెలిపారు. ఇకపై కొత్త నిబంధనలు, తాజా యాజమాన్య నిర్మాణానికి అనుగుణంగా కంపెనీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: