हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Tahawwur Rana : ముంబై దాడుల్లో నా పాత్ర లేదు… తహవ్వూర్ రాణా

Divya Vani M
Tahawwur Rana : ముంబై దాడుల్లో నా పాత్ర లేదు… తహవ్వూర్ రాణా

2008లో ముంబైను కుదిపేసిన 26/11 ఉగ్రదాడి కుట్రలో తనకు ఎలాంటి సంబంధం లేదని తహవ్వుర్ రాణా స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్న రాణాను, ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం సుదీర్ఘంగా విచారించింది.సుమారు ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ విచారణలో రాణా చాలా విషయాలు వెల్లడి చేశాడు. 166 మంది అమాయకుల ప్రాణాలను తీసిన దాడిలో తన పాత్ర ఏమాత్రం లేదని తేల్చిచెప్పాడు. దాడులకు గానీ, ప్రణాళికలకు గానీ తాను జవాబుదారిని కాదని రాణా తెలిపినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు.తన చిన్ననాటి స్నేహితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ మాత్రమే రెక్కీ నిర్వహించి, దాడులకు మౌలికం వేసినట్లు రాణా ఆరోపించాడు. లష్కరే తోయిబా తరఫున హెడ్లీ ముంబై సహా భారత్‌లో అనేక ప్రదేశాల్లో రెక్కీ చేసినట్టు ఇంతకుముందు అంగీకరించాడు కూడా.విచారణలో రాణా కొన్ని కీలక విషయాలను బయటపెట్టాడు. ముంబై, ఢిల్లీతో పాటు కేరళను కూడా సందర్శించినట్లు తెలిపాడు.

Tahawwur Rana ముంబై దాడుల్లో నా పాత్ర లేదు... తహవ్వూర్ రాణా
Tahawwur Rana ముంబై దాడుల్లో నా పాత్ర లేదు… తహవ్వూర్ రాణా

కేరళ పర్యటనపై దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా, ఓ పరిచితుడిని కలవడమే లక్ష్యమని చెప్పాడు. ఆ వ్యక్తి పేరు, చిరునామా వంటి వివరాలను కూడా అధికారులకు అందించాడు. దీంతో రాణా చెప్పిన విషయాలను నిర్ధారించేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ త్వరలో కేరళ పర్యటనకు సిద్ధమవుతోంది.అయితే, విచారణలో రాణా పూర్తిగా సహకరించలేదని అధికారులు చెబుతున్నారు. తరచూ పల్లపు సమాధానాలు ఇచ్చి, స్పష్టత ఇవ్వకుండానే తప్పించుకునే ప్రయత్నం చేశాడట. చాలా సంవత్సరాల క్రితం జరిగిన దాడికి సంబంధించి స్పష్టమైన జ్ఞాపకాలేమీ లేవంటూ జ్ఞాపకశక్తి లోపాన్ని చూపించినట్లు సమాచారం.ప్రస్తుతం ఎన్ఐఏ ముంబై దాడులకు ముందు లష్కరే తోయిబా మరియు పాకిస్థాన్ ఐఎస్ఐ కలిసి రాచిన కుట్రపై విస్తృత దర్యాప్తు జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగానే రాణాను విచారిస్తున్నారు.తహవ్వుర్ రాణాకు అబ్దుర్ రెహ్మాన్ హషీమ్ సయ్యద్, సాజిద్ మజీద్, ఇలియాస్ కశ్మీరీ, జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ లాంటి కీలక ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న అనుమానాలపై కూడా విచారణ సాగుతోంది. పాకిస్థాన్ ఆర్మీ మెడికల్ కోర్‌లో మాజీ అధికారిగా పనిచేసిన రాణాను, అమెరికా నుంచి ప్రత్యేకంగా భారత్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు.

Read Also : LOC tensions : పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎల్ఓసీ వద్ద పెరిగిన ఉద్రిక్తత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870