Supreme Court warning speaker : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై Supreme Court of India మరోసారి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. మూడు వారాల్లోపు పెండింగ్లో ఉన్న పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆ గడువు దాటితే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తప్పవని స్పీకర్కు స్పష్టంగా తెలియజేసింది.
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ Bharat Rashtra Samithi దాఖలు చేసిన పిటిషన్లపై గతంలోనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు మరోసారి కోర్టును ఆశ్రయించారు.
Read Also: Soil testing : భూసార పరిరక్షణతోనే సాగు ముందడుగు
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం, స్పీకర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న అనంతరం స్పష్టమైన గడువు విధించింది. ఇప్పటికే ఒక పిటిషన్పై నిర్ణయం వెలువడిందని, మరో రెండు తుది దశలో ఉన్నాయని స్పీకర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపినా, పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను ధర్మాసనం సీరియస్గా పరిగణలోకి తీసుకుంది.
చివరగా ధర్మాసనం, “ఈసారి తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతాం” అని హెచ్చరించింది. అలాగే కోర్టులో జరిగిన వాదనల ఆధారంగా సోషల్ మీడియాలో రీల్స్ చేయవద్దని కూడా న్యాయమూర్తి స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: