ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్ల(Supreme court) అమలుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది. ‘జనరల్ కేటగిరీ’ అనేది కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితం కాదని, మెరిట్ ఆధారంగా అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
Read also: Karur stampede: టీవీకే పార్టీ అధినేత విజయ్కు సీబీఐ నోటీసులు?

మెరిట్ ఉన్న రిజర్వ్డ్ అభ్యర్థులు జనరల్ కోటాలోకి రావచ్చని స్పష్టం
ఈ అంశంలో రాజస్థాన్ హైకోర్టు(Supreme court ) ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు, రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు జనరల్ కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే, వారిని ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగానే పరిగణించాలని ఆదేశించింది. ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు అనుగుణమేనని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ తీర్పుతో ప్రతిభ ఆధారంగా ఎంపికైన రిజర్వ్డ్ అభ్యర్థులకు జనరల్ కోటాలో అవకాశాలు మరింత స్పష్టంగా లభించనున్నాయి. మెరిట్కు ప్రాధాన్యం ఇస్తూ నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: