పిటిషన్ను గోప్యంగా ఉంచాలని ఫిర్యాదుదారుని ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: హైకోర్టు జడ్జిలను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ ఉత్తర్వులు ఆందోళనకరమంటూ ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, లోక్పాల్ రిజిస్ట్రార్లకు నోటీసులు పంపింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చిలో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

సుమోటోగా తీసుకొని విచారణ
హైకోర్టు సిట్టింగ్ అదనపు జడ్జిపై దాఖలైన రెండు ఫిర్యాదులను లోక్పాల్ విచారిస్తోంది. లోకాయుక్త చట్టం 2013 ప్రకారం హైకోర్టు జడ్జిలను విచారించే అధికారం తమకు ఉందంటూ జనవరి 27న ఉత్తర్వులు జారీచేసింది. ఈనేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టి.. స్టే విధించింది. అలాగే సదరు హైకోర్టు న్యాయమూర్తి పేరును బయటకు వెల్లడించొద్దని ఫిర్యాదుదారుడిని ఆదేశించింది.
అవినీతి నిరోధక సంస్థ ఉత్తర్వులు జారీ
ఒక హైకోర్టు సిట్టింగ్ అదనపు న్యాయమూర్తిపై దాఖలైన రెండు ఫిర్యాదులను విచారిస్తున్న సందర్భంగా అవినీతి నిరోధక సంస్థ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ప్రైవేట్ కంపెనీ ఫిర్యాదుదారుడిపై దాఖలు చేసిన కేసును ఎదుర్కోవాల్సిన అదే హైకోర్టుకు చెందిన మరో న్యాయ అధికారిని మరియు రాష్ట్రంలోని అదనపు జిల్లా న్యాయమూర్తిని న్యాయమూర్తి ప్రభావితం చేసి, ఆ సంస్థకు అనుకూలంగా వ్యవహరించారని పిటిఐ నివేదించింది. న్యాయమూర్తి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ ప్రైవేట్ సంస్థ ఆయన క్లయింట్గా ఉందని ఆరోపించారు.