📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Sunita Williams: త్వరలో భారత్‌కు రానున్న సునీత విలియమ్స్‌..!

Author Icon By sumalatha chinthakayala
Updated: March 19, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sunita Williams : దాదాపు తొమ్మిది నెల‌ల పాటు అంత‌రిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పుడమికి చేరిన వారికి యావత్తు ప్రపంచం వెల్‌కమ్‌ చెప్పింది.

స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు

ఇక సునీత సురక్షితంగా భూమికి చేరడంతో భారత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గుజ‌రాత్ రాష్ట్రంలోని ఝూలాస‌న్‌లో ఆమె బంధువులు, స్థానికులు బాణ‌సంచా కాల్చి నృత్యాలు చేస్తూ సంబ‌రాలు చేసుకున్నారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 286 రోజుల తర్వాత సునీత సేఫ్‌గా భూమిపైకి రావడంపై ఆమె సోదరి ఫాల్గుణి పాండ్యా సంతోషం వ్యక్తం చేశారు. సునీత కోసం తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

సునీత త్వరలోనే భారత్‌కు

ఈ సందర్భంగా అమెరికా ప్రభుత్వానికి, నాసాకు కృతజ్ఞతలు తెలిపారు. సునీత త్వరలోనే భారత్‌ కు రానున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.ఓ జాతీయ మీడియాతో ఫాల్గుణి మాట్లాడుతూ.. తొమ్మిది నెలల విరామం తర్వాత సునీత సురక్షితంగా భూమిపైకి రావడం సంతోషంగా ఉంది. ఆమె పుడమిపైకి దిగిన క్షణాలు అపురూపం. ఎలాంటి సవాళ్లనైనా ఆమె ధైర్యంగా ఎదుర్కోగలదు. సునీత త్వరలోనే భారత్‌కు రానున్నారు. మేమంతా వెకేషన్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నాం. కుటుంబ సభ్యులతో చాలా సమయం గడపబోతున్నాం అని తెలిపారు.

Breaking News in Telugu Google news Google News in Telugu india Latest News in Telugu Paper Telugu News Sunita Williams Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.