Sunil Kumar: పాక్ కాల్పుల్లో మరో సైనికుడు మృతి

Read Time:  1 min
Sunil Kumar: పాక్ కాల్పుల్లో మరో సైనికుడు మృతి
FONT SIZE
GET APP

పాకిస్తాన్ కాల్పుల్లో 25 సంవత్సరాల రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ అమరుడయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో జరిగిన పాక్ దుశ్చర్యలో ఆయన వీర మరణం పొందారు. సునీల్ కుమార్ స్వస్థలం జమ్మూలోని ట్రెవా గ్రామం అని పేర్కొన్నారు అధికారులు. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు, మరియు భారత దేశం వీర జవాను ఘనంగా స్మరించుకుంటుంది.

జమ్మూలో పాకిస్తాన్ కాల్పుల్లో సునీల్ కుమార్ మృతి

జమ్మూకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో జరిగిన పాక్ కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ తీవ్ర ఫిరంగి కాల్పులను ప్రారంభించి, సునీల్ కుమార్ ను మృత్యువాత పడ్డారు. సునీల్ కుమార్ మృతదేహాన్నిస్వస్థలం జమ్మూలోని ట్రెవా గ్రామం. ఆపరేషన్ సింధూర్‌ తర్వాత పాకిస్తాన్ తీవ్ర ఫిరంగి కాల్పుల మధ్య ఈ సంఘటన జరిగింది. ఆదివారం అమరుడైన జవాను మృతదేహాన్ని ఆయన నివాసానికి సహచర సైనికులు తీసుకొచ్చారు. సునీల్ కుమార్ మృతదేహం చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన దాడి, జవానుల ధైర్యం మిన్నంటించేలా ఉంది. సునీల్ కుమార్ వంటి వీరులు తమ ప్రాణాలను కోల్పోయినా, దేశం రక్షణ పట్ల తమ కర్తవ్యాన్ని పూర్తి చేయడంలో ఎప్పటికప్పుడు నిబద్ధతను ప్రదర్శిస్తున్నారు.

 ఆంధ్రప్రదేశ్‌ లోని సత్యసాయి జిల్లాకు చెందిన అమరజవాన్‌ మురళీనాయక్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వీర జావన్‌కు నివాళులర్పించేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. బైకులపై మురళీ ఫొటోలు పట్టుకుని ఆఖరి మజిలీ వరకు నడిచారు. జై జవాన్.. జై మురళీ అంటూ నినాదాలు చేస్తూ వాహనం వెంట ర్యాలీ నిర్వహించారు.

Read also: Amritsar: భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ..అమృత్‌సర్‌లో రెడ్ అలెర్ట్

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.