Sukhoi Su-30: భారత వాయుసేన (IAF)కు చెందిన సుఖోయ్-30 (Su-30 MKI) యుద్ధ విమానం అస్సాం రాష్ట్రంలో అదృశ్యమైనట్లు తెలుస్తోంది.రాడార్తో సంబంధాలు తెగిపోవడంతో విమానం ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు, విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: Iran Israel War: పడిపోయిన బాస్మతి బియ్యం ధరలు
విమానం రాడార్ పరిధి నుంచి హఠాత్తుగా మాయమైందని, పైలట్ల రక్షణ కోసం వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ స్పందించారు. విమానం రాడార్ కాంటాక్ట్ కోల్పోయిన మాట వాస్తవమేనని, ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
మరిన్ని అప్డేట్స్ తెలియాల్సి ఉంది
సుఖోయ్ ఎస్ యూ-30ఎంకేఐ భారత వాయుసేనలో అత్యంత శక్తివంతమైన మల్టీ-రోల్ ఫైటర్ జెట్గా గుర్తింపు పొందింది. రష్యా నుంచి సేకరించిన ఈ విమానాలు సరిహద్దు రక్షణతో పాటు కీలకమైన ఆపరేషన్లలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అటువంటి అత్యాధునిక విమానం అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది.ప్రస్తుతం విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు? ప్రమాదం ఎక్కడ జరిగి ఉండవచ్చు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. సిబ్బందిని సురక్షితంగా గుర్తించేందుకు వైమానిక దళం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: