📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Student suicide: ట్యూషన్‌కు వెళ్లనని మారం..మందలించిన తల్లి బాలుడి ఆత్మహత్య

Author Icon By Sharanya
Updated: July 3, 2025 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబై నగరంలోని కండివాలి ప్రాంతంలో ఓ పద్నాలుగు సంవత్సరాల బాలుడు (Fourteen-year-old boy) ఆత్మహత్య (Student suicide) చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ట్యూషన్‌కు వెళ్లాలని తల్లి చేసిన ఒత్తిడి కారణంగా బాలుడు ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన విద్యార్థులపై చదువుల ఒత్తిడి ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నదో మరోసారి చాటిచెప్పింది.

ఘటన వివరాలు:

14 ఏళ్ల పంత్ ఆర్తి మక్వానా (Pant Aarti Makwana), అనే బాలుడిని అతని తల్లి నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ట్యూషన్‌కు వెళ్లమని చెప్పింది. అయితే, ట్యూషన్‌కు వెళ్లేందుకు పంత్ ఇష్టపడలేదు. తల్లి పదేపదే చెప్పడంతో చివరకు అయిష్టంగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. కొడుకు ట్యూషన్‌కు వెళ్లాడని తల్లి భావించింది. కానీ, కొద్ది నిమిషాలకే వారి అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ పరుగున వచ్చి, పంత్ భవనం పైనుంచి పడిపోయాడని (Student suicide) చెప్పాడు. ఈ వార్త విన్న తల్లి వెంటనే కిందకు వెళ్లి చూడగా, తన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్‌కు గురైంది.

పోలీసుల స్పందన:

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలంలో అనుమానించదగ్గ అంశాలేవీ కనిపించలేదని, అయినప్పటికీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదువుల ఒత్తిడి కారణంగానే బాలుడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Read also: Delhi: ఢిల్లీ లో జంట హత్యల కలకలం

#AcademicPressure #ChildMentalHealth #MumbaiNews #Pant Aarti Makwana #ParentingAwareness #StopTheStigma #StudentSuicide #TuitionStress #YouthSuicide Breaking News in Telugu Breaking News Telugu Current News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Sunday Magzine Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Paper Telugu Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu Weather Today Web Stories in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.