📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News: Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Author Icon By Vanipushpa
Updated: October 23, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత స్టాక్ మార్కెట్లు(Stock Market) వరుసగా ఆరో రోజూ లాభాల బాటలో పయనించాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు గురువారం కూడా లాభాలతో ముగిశాయి. అయితే, ట్రేడింగ్ చివరి గంటల్లో లాభాల స్వీకరణ జరగడంతో ఇంట్రాడే గరిష్ఠాల నుంచి కిందకు జారాయి. ట్రేడింగ్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 864 పాయింట్ల వరకు లాభపడి 85,290 వద్ద కొత్త 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. కానీ చివరికి 130 పాయింట్ల స్వల్ప లాభంతో 84,556 వద్ద ముగిసింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 26,104 స్థాయికి చేరినప్పటికీ, చివరకు కేవలం 23 పాయింట్ల లాభంతో 25,891 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది.

Read Also: G alert: UCO బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర

Stock Market

భారత్-అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం

ఐటీ రంగ షేర్లు ఈ ర్యాలీని ముందుండి నడిపించాయి. ఇన్ఫోసిస్ ప్రమోటర్లు రూ.18,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌లో పాల్గొనబోమని ప్రకటించడంతో ఆ సంస్థ షేరు ఏకంగా 4 శాతం పెరిగింది. దీనికి తోడు, భారత్-అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న వార్తల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్లు కూడా రెండు శాతానికి పైగా లాభపడ్డాయి.

లాభపడిన షేర్లలో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్..

ఇతర లాభపడిన షేర్లలో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, టాటా మోటార్స్ ఒక శాతానికి పైగా వృద్ధి చెందాయి. మరోవైపు, ఎటర్నల్ 3 శాతంతో టాప్ లూజర్‌గా నిలవగా, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు 1 నుంచి 2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే, బ్రాడర్ మార్కెట్‌లో సెంటిమెంట్ బలహీనంగానే ఉంది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Business News financial news Indian Economy investors Market Gains Nifty sensex share market stock market Telugu News Trading Updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.