📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Haridwar : మానస దేవి ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి

Author Icon By Divya Vani M
Updated: July 28, 2025 • 7:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర నగరం హరిద్వార్‌లో ఘోర విషాదం (A terrible tragedy in Haridwar) చోటు చేసుకుంది. మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు (Eight devotees lost their lives in the stampede). మరో 30 మంది గాయపడ్డారు.ప్రధాన ఆలయానికి వెళ్లే మెట్లపై అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. విద్యుత్ షాక్‌ పుకార్లు జనంలో భయాందోళనలకు దారితీశాయి. దీంతో భక్తులు పరుగులు తీయగా, పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు ఇదే కారణంగా తొక్కిసలాట జరిగిందని భావిస్తున్నారు.

Haridwar : మానస దేవి ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి

అధికారుల స్పందన

గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే వివరాలు వెల్లడించారు. ఘటనకు ముందు ఆలయం వద్ద భారీగా భక్తులు గుమికూడారని చెప్పారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లలో సమీప ఆసుపత్రులకు తరలించామని తెలిపారు.మృతుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరుష్ (12), వివేక్ (18), వకీల్, శాంతి, ఉత్తరాఖండ్‌కు చెందిన విపిన్ సైని (18), బీహార్‌కు చెందిన షకల్ దేవ్ (18) ఉన్నారు. మొత్తం 30 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఎస్‌డీఆర్ఎఫ్‌, స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో ఉన్నాయని తెలిపారు. భక్తుల భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని అన్నారు.మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. బాధితుల కోసం పోలీసులు హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.ఈ ఘటనతో హరిద్వార్‌లో విషాద వాతావరణం నెలకొంది. భక్తులు, స్థానికులు ఇంకా షాక్‌లో ఉన్నారు. అధికారులు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చే చర్యలు తీసుకుంటున్నారు.

Read Also : Encounter : ఛత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్… నలుగురు మృతి

Haridwar Haridwar Latest News Haridwar Tragedy Mansa Devi Temple Mansa Devi Temple Accident Pilgrims Death Stampede Temple Stampede Uttarakhand news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.