సంక్రాంతి పండగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడపనుందని(Special Trains) ప్రకటించింది. ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి రైల్వే అధికారులు కొన్ని రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
Read also: ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

సంక్రాంతి పండగ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్
సికింద్రాబాద్-అనకాపల్లి (07041) మధ్య ప్రత్యేక రైలు జనవరి 4, 11, 18 తేదీల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో(Special Trains) అనకాపల్లి-సికింద్రాబాద్ (07042) మధ్య ఈ రైలు జనవరి 5, 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇక, హైదరాబాద్-గోరఖ్పూర్ (07075) రైలు జనవరి 9, 16, 23 తేదీల్లో, గోరఖ్పూర్-హైదరాబాద్ (07076) రైలు జనవరి 11, 18, 25 తేదీల్లో నడుస్తాయి. మచిలీపట్నం-అజ్మీర్ (07274) మధ్య జనవరి 21న ప్రత్యేక రైలు నడుస్తుంది. అలాగే, అజ్మీర్-మచిలీపట్నం (07275) మధ్య ఈ నెల 28న ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :