కరూర్ ఘటన(Karur Tragedy) నేపథ్యంలో తమిళనాడు రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. టీవీకే చీఫ్ విజయ్ చెన్నైలోని నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఇంటి చుట్టూ నాలుగు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి, ఆ మార్గంలో సాధారణ ప్రజలను కూడా అనుమతించడం లేదు. ఈ చర్యలతో ఆ ప్రాంతం మొత్తం భద్రతా వలయంలోకి చేరినట్లయింది.
కరూర్ ఘటన అనంతరం డీఎంకే కార్యకర్తలు విజయ్ ఇంటి(Vijay House)ని చుట్టుముట్టి నిరసన తెలపాలని ప్రయత్నించగా, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారు. మరోవైపు విజయ్కు మద్దతుగా టీవీకే కార్యకర్తలు కూడా ఆయన ఇంటి వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ కూడా పోలీసులు గట్టి నిఘా పెట్టి వారిని వెనక్కి పంపించారు. దీనివల్ల విజయ్ నివాసం చుట్టూ ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Amaravati Farmers : అమరావతి రైతుల సమస్యలు తీరలేదు – సుజనా
ఈ పరిణామాలన్నీ కరూర్ ఘటనపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకత, రాజకీయ చర్చలకు ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరగడం, మరొకవైపు ఆయన నివాసం వద్ద నిరసనలు, మద్దతు చర్యలు ఒకేసారి జరగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సామాజిక వర్గాలు, రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.