📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మరో ఘనత సాధించిన ఇస్రో

Author Icon By sumalatha chinthakayala
Updated: January 16, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా అంతరిక్షంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 2025 ఏడాదిలో తొలి విజయాన్ని అందుకుంది. గతేడాది చివర్లో నింగిలోకి పంపించిన స్పెడెక్స్ ప్రయోగానికి సంబంధించి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయినట్లు స్వయంగా ఇస్రో.. ట్విటర్‌లో వెల్లడించింది. ఇక అంతరిక్షంలో శాటిలైట్లను అనుసంధానం చేయడం చాలా క్లిష్టమైన పని కాగా.. ఇప్పటివరకు ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే.. ఈ ఘనతను సాధించాయి. తాజాగా ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఆ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

ఇది ఒక చరిత్రాత్మక క్షణం అని ఇస్రో పేర్కొంది. 15 మీటర్ల నుంచి 3 మీటర్ల హోల్డ్ పాయింట్ వరకు ఈ డాకింగ్ పూర్తి అయినట్లు ప్రకటించింది. అత్యంత ఖచ్చితత్వంతో డాకింగ్ ప్రక్రియను ప్రారంభించగా.. అది విజయవంతంగా అనుసంధానం అయిందని పేర్కొంది. ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో.. ప్రపంచంలోనే ఇలాంటి స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించినట్లు ఇస్రో వెల్లడించింది. భారత్ కంటే ముందు చైనా, రష్యా, అమెరికా దేశాలు స్పేస్ డాకింగ్‌లో విజయవంతం అయ్యాయి. ఈ సందర్భంగా ఈ ప్రక్రియలో పాల్గొన్న ఇస్రో టీమ్‌కు, దేశానికి ఇస్రో శుభాకాంక్షలు తెలిపింది.

ఇటీవల గత డిసెంబర్‌ 30వ తేదీన తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60(పీఎస్ఎల్వీ-సీ60) వాహకనౌకలో రెండు శాటిలైట్లను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించారు. SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించగా.. అక్కడే వాటిని అనుసంధానం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఉపగ్రహాలను తాజాగా విజయవంతంగా అనుసంధానం చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ మేరకు స్పేడెక్స్‌ డాకింగ్‌ ప్రక్రియ విజయవతంగా పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది.

పీఎస్‌ఎల్‌వీ సీ-60 నింగిలోకి దూసుకెళ్లిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్‌-1బి.. 15.12 నిమిషాలకు స్పేడెక్స్‌-1ఎ రాకెట్‌ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వాటిని డాకింగ్‌ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు 3 సార్లు ప్రయత్నించారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ డాకింగ్ ప్రక్రియ వాయిదా పడుతూ రాగా.. తాజాగా సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే ఆ రెండు శాటిలైట్ల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకువచ్చినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో తదుపరి కీలక ప్రాజెక్టులైన భారతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్ 4 ప్రయోగాలకు ఇది తోడ్పాటును అందించనుంది.

ISRO ISRO Satellites Satellite Docking Spadex

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.