South Central Railway : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, నాందేడ్, మచిలీపట్నం మార్గాల్లో మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 11 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
రైల్వే ప్రకటన ప్రకారం, రెండు ప్రత్యేక రైళ్లు కాకినాడ – సికింద్రాబాద్ – వికారాబాద్ మార్గంలో నడుస్తాయి. మరో రెండు రైళ్లు నాందేడ్ – కాకినాడ మధ్య సేవలందిస్తాయి. అదనంగా, మచిలీపట్నం – వికారాబాద్ మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
Read also: Copper Price : భవిష్యత్లో సిరులు కురిపించనున్న కాపర్!
కాకినాడ – వికారాబాద్ ప్రత్యేక రైలు (07450) జనవరి 19న సాయంత్రం 4:45 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
వికారాబాద్ – కాకినాడ రైలు (07451) జనవరి 20న ఉదయం 9 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి, రాత్రి 9:15 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
నాందేడ్ – కాకినాడ ప్రత్యేక రైలు (07452) జనవరి (South Central Railway) 12న మధ్యాహ్నం 1:30 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ – నాందేడ్ రైలు (07453) జనవరి 13న మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
అలాగే, మచిలీపట్నం – వికారాబాద్ రైలు (07454) జనవరి 11 మరియు 18 తేదీల్లో ఉదయం 10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
వికారాబాద్ – మచిలీపట్నం రైలు (07455) జనవరి 11, 18 తేదీల్లో రాత్రి 10 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:15 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను కోరింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: