Telugu News: Karnataka: తెలివైన భార్య.. భర్లలో లోపం.. రూ. 2కోట్లు డిమాండ్

Read Time:  1 min
Karnataka
Karnataka
FONT SIZE
GET APP

పెళ్లి రెండు మనసుల మధ్య కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల మధ్య అనుబంధం. పెళ్లంటే నూరేళ్లు హ్యాపీగా జీవించేందుకు ఏడడుగులతో ప్రారంభమయ్యే సంసారనావ. మనసున మనసై తోడొకరు ఉంటే జీవితమే స్వర్గసీమ అవుతుంది. కానీ నేటి పెళ్లిళ్లు మూడురోజులకే పెటాకులుగా మారుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అనురాగమే తప్ప ఆవేశాలు, అహంకారాలు కాదు. రానురాను భార్యాభర్తల మధ్య అనురాగాలు సన్నగిల్లుతున్నాయి. భర్తను మోసం చేస్తున్న భార్యలు, అలాగే భార్యను మోసగిస్తూ, పరాయి స్త్రీల పంచన చేరుతున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? అయితే మీరే చదవండి.

భర్తలో లోపం లేదని తేల్చిన పోలీసులు

కర్ణాటకలోని చిక్కమంగళూరుకి చెందిన ప్రవీణ్, చందన అనే యువతికి ఈ ఏడాది మే 5న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట బెంగళూరులోని సప్తగిరి ప్యాలెస్ లో నివాసం ఉంటున్నారు. మే 16 ఫస్ట్ నైట్ జరిగింది. అయితే శోభనంలో భర్త విఫలమయ్యాడు. తొలిరాత్రి ప్రవీణ్ శారీరక సంబంధానికి నిరాకరించాడు. దీంతో ఈ వివాదం మొదలైంది. ఈ క్రమంలో చందన మెడికల్ టెస్టులు(Medical test) చేయించుకోవాలని భర్తకు చెప్పింది.

Karnataka

ఒకరిపై ఒకరు కేసులు

వైద్యులు ప్రవీణ్ కు పరీక్షలు చేసి, ఆయన ఎలాంటి లోపం లేదని మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. చందన మాత్రం తనపై ఒత్తిడి పెంచి పరిహారంగా రూ.2కోట్లు డిమాండ్(Demand) చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అతడు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే గతనెల 17న చందన కుటుంబ సభ్యులు ప్రవీణ్ ఇంట్లోకి చొరబడి అతనితో పాటు బంధువులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

వివాదానికి కారణం ఏమిటి?
పెళ్లి తర్వాత మొదటి రాత్రి భర్త శారీరక సంబంధానికి నిరాకరించడమే వివాదానికి కారణమైంది.

వైద్యులు ఏమన్నారు?
ప్రవీణ్‌లో ఎలాంటి శారీరక లోపం లేదని, కేవలం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని వైద్యులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.