గత కొద్ది కాలం నుంచి పసిడి ధరలు నింగిని తాకాయి. రాకెట్ కన్నా వేగంగా సిల్వర్ ధరలు దూసుకుపోతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు చూసి సామాన్యులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఇక పెట్టుబడిదారుల సంగతి చెప్పనవసరం లేదు. ఈ పెరుగుదల చూసి ఆశ్చర్యపోతున్నారు. మధ్యమధ్యలో లాభాలు అందుకుంటున్నప్పటికీ వెండి(Silver) ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయోనన్న సందేహం వారిలో నెలకొంది. ఈ పెరుగుదల ఎక్కడ ఆగుతుందో అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించక పెట్టుబడిదారులు అయోమయానికి గురవుతున్నారు.
Read Also: Parliament Updates: ప్రారంభమైన అఖిలపక్ష భేటీ
వెండిపై పెరుగుతున్న డిమాండ్కి ప్రధాన కారణం
వెండిపై పెరుగుతున్న డిమాండ్కి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులు అని చెప్పవచ్చు. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, సౌర విద్యుత్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ పరిశ్రమ వంటి రంగాల్లో వెండి కీలక ముడి పదార్థంగా మారింది. దీంతో పరిశ్రమల డిమాండ్ ఏటా పెరుగుతూనే ఉంది. అదే సమయంలో మైనింగ్ ఉత్పత్తి మాత్రం ఆ వేగాన్ని అందుకోలేకపోతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్-సరఫరా మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ పరిస్థితుల మధ్య చైనా తీసుకున్న తాజా విధాన నిర్ణయం Silver మార్కెట్లను మరింత ఆందోళనలోకి నెట్టేసింది. జనవరి 1 2026 నుండి వెండి ఎగుమతులపై చైనా కఠిన నియంత్రణలు విధించింది. ఇకపై చైనా నుండి వెండిని ఎగుమతి చేయాలంటే ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి. అవి కూడా కేవలం పెద్ద, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలకే పరిమితం కావచ్చని అంచనా. దీని వల్ల చిన్న ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: