భారతదేశంలో పండుగలు అంటే కేవలం పిండి వంటలు, కొత్త బట్టలు మాత్రమే కాదు.. అవి మన వృత్తి, వ్యాపారాలతో కూడా ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా తెలుగు వారికి వచ్చే ఉగాది (ugadi) పర్వదినం ఒక కొత్త ఆర్థిక సంవత్సరానికి నాంది. ఏప్రిల్ 1న ప్రభుత్వపరంగా ఫైనాన్షియల్ ఇయర్ మారినప్పటికీ, మన దేశీయ వ్యాపారవేత్తలు, వర్తకులు మాత్రం ఉగాది నాడే తమ కొత్త ఖాతా పుస్తకాలను (New Accounts) ప్రారంభించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న నమ్మకం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కొన్ని సాంప్రదాయాల ప్రకారం.. ఉగాది అంటే యుగానికి ఆది అని. అంటే సృష్టి ప్రారంభమైన రోజు. బ్రహ్మ దేవుడు ఈ రోజే సృష్టిని మొదలుపెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఏదైనా కొత్త పనిని, ముఖ్యంగా ఆర్థిక సంబంధిత వ్యవహారాలను ఈ రోజున ప్రారంభిస్తే అది విజయవంతం అవుతుందని నమ్ముతారు.
Read Also: HDFC New Rules: 1 నుండి కొత్త బ్యాంకింగ్ నిబంధనలు!
‘బొమ్మల పూజ’ లేదా ‘ఖాతా పూజ’
ఉగాది నాడు చేసే ‘పంచాంగ శ్రవణం’ లో ఆ ఏడాది ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుని, దానికి అనుగుణంగా తమ వ్యాపార ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు వచ్చినప్పటికీ.. ఉగాది (Ugadi) రోజున ఒక కొత్త పుస్తకాన్ని కొని, దానికి పసుపు, కుంకుమలతో పూజ చేయడం ఇప్పటికీ కనిపిస్తుంది. దీనిని ‘బొమ్మల పూజ’ లేదా ‘ఖాతా పూజ’ అని కూడా పిలుస్తారు. లాభనష్టాలను బేరీజు వేసుకుని, పాత బాకీలను వీలైనంత వరకు క్లియర్ చేసి, కొత్త ఉత్సాహంతో వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి ఇది ఒక మంచి సందర్భం. నమ్మకం వెనుక ఉన్న సైకాలజీ వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం. అయితే ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉన్నట్లే, వ్యాపారంలో వచ్చే కష్టనష్టాలను సమానంగా స్వీకరించాలనే సందేశం ఇందులో దాగి ఉంది. కొత్త ఖాతాలు తెరవడం వల్ల వ్యాపారస్తులకు ఒక రకమైన మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం (Positive Mindset) ఏర్పడుతుంది. కొత్త ఏడాదిలో తమ వ్యాపారం లాభాల బాట పడుతుందని, లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని వారు బలంగా నమ్ముతారు.
hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: