📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Karnataka-మతం మార్పిడిలపై సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

Author Icon By Sushmitha
Updated: September 15, 2025 • 3:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మత మార్పిడులకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. హిందువులు మతం మారడానికి.. హిందూ మతంలో ఉన్న కొన్ని ఆచారాలే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ సహా పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా అంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు.

హిందూ మతంలో అసమానతలే కారణం: సిద్ధరామయ్య

ఇటీవల కుల గణనపై నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం సిద్ధరామయ్య మత మార్పిడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ మతంలో సమానత్వం లేకపోవడం వల్లే కొందరు ఇతర మతాలను స్వీకరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా “హిందూ మతంలో సమానత్వం ఉంటే.. ఎవరైనా ఎందుకు మతం మారుతారు?” అని ప్రశ్నించారు. అలాగే, అంటరానితనాన్ని తాము ఏమైనా తీసుకొచ్చామా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

సిద్ధరామయ్య మాట్లాడుతూ, హిందూ మతంలో అసమానతలు, అంటరానితనం వంటి ఆచారాలు కొనసాగుతున్నాయని, ఇవే హిందువుల్లోని కొన్ని వర్గాల ప్రజలు ఇతర మతాల్లోకి మారడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. మతం(religion) మారడం ప్రజల హక్కు అని, తాము కానీ, బీజేపీ కానీ మతం మారమని ఎవరినీ అడగడం లేదని కూడా ఆయన తెలిపారు.

బీజేపీ ఫైర్: ఆర్‌. అశోక విమర్శలు

సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇస్లాంను ప్రశ్నించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ పక్షనేత ఆర్‌. అశోక ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ప్రశ్నించారు. “ఇస్లాంలో సమానత్వం ఉంటే, ముస్లిం మహిళలను మసీదుల్లోకి ఎందుకు అనుమతించడం లేదు? ట్రిపుల్ తలాక్‌ను(Triple Talaq) ఎందుకు వ్యతిరేకించారు? ముస్లిమేతరులు, హిందువులను ఖురాన్‌లో ‘కాఫిర్లు’గా ఎందుకు పిలుస్తున్నారు? ఇలాంటివన్నీ అడిగే దమ్ము సిద్ధరామయ్యకు ఉందా?” అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు.

మత మార్పిడుల గురించి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఏమిటి?

హిందూ మతంలో సమానత్వం లేకపోవడం, అంటరానితనం వంటి ఆచారాలే హిందువులు మతం మారడానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందించింది?

ఇస్లాం, ఇతర మతాలపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా అని బీజేపీ నేతలు సిద్ధరామయ్యను నిలదీశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/corporate-strange-incident-at-bangalore-theater-office-work-while-watching-a-movie/national/547686/

BJP Hindu religion Karnataka political controversy. R Ashoka religious conversion Siddaramaiah

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.