కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) మరోమారు స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. అధికారంలోకి వచ్చాక సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, సిద్ధరామయ్య, డీ.కే. శివకుమార్ చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. ఈ క్రమంలో రెండవ దఫా సీఎంగా ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్కు అవకాశం ఉంటుందనే ప్రచారం కొంతకాలంగా కొనసాగుతోంది.
Zubeen Garg: పధకం ప్రకారమే జుబీన్ గార్గ్ హత్య : సీఎం హిమంత శర్మ
ప్రచారానికి ముగింపు పలకాలి
పార్టీ పెద్దలు, సిద్ధరామయ్య, ఆయన వర్గం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నప్పటికీ, ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ అంశంపై మరోసారి స్పందించారు. ఇటువంటి ప్రచారానికి ముగింపు పలికేలా పార్టీ అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సిద్ధరామయ్య ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని డీ.కే. శివకుమార్ చెబుతున్నప్పటికీ, ఆయన వర్గం ఎమ్మెల్యేల తీరు మాత్రం మరో విధంగా ఉంది. ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా తీవ్ర గందరగోళంలో ఉందని ఆయన అన్నారు. మరికొన్ని నెలల్లో అనూహ్య పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: