📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Siddaramaiah: ఈ ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి..

Author Icon By Anusha
Updated: July 10, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మారుతుందనే ఊహాగానాలకు సీఎం సిద్ధరామయ్య ఒక్క ప్రకటనతో చెక్ పెట్టారు.రాష్ట్రానికి ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించేందుకు తనను రాజీనామా చేయమని అధిష్ఠానం కోరినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి పదవిలో పూర్తి ఐదేళ్లు నేనే ఉంటాను. ఈ విషయాన్ని జులై 2వ తేదీన డీకే శివకుమార్ సమక్షంలోనే స్పష్టం చేశాను. ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి (Chief Minister’s post) కి పోటీదారుడే, అందులో తప్పేమీ లేదు. అయితే ‘ప్రస్తుతం కుర్చీ ఖాళీగా లేదు’ అని ఆయనే అన్నారు కదా” అని సిద్ధరామయ్య గుర్తు చేశారు.

Siddaramaiah: ఈ ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు

డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన అంగీకరించారు.రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే అంశంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, నిధుల కొరత లేదని సిద్ధరామయ్య (Siddaramaiah) స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, ముఖ్యంగా ఈడీని కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు.

కర్ణాటక కొత్త ఉప ముఖ్యమంత్రి ఎవరు?

డీకే శివకుమార్ గారు కర్ణాటక రాష్ట్రానికి కొత్త ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

కర్ణాటక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు?

క్యాసంబల్లి చెంగలరాయ రెడ్డి (Kyasamballi Chengalaraya Reddy) గారు కర్ణాటకకు (అప్పట్లో మైసూరు రాష్ట్రం) తొలి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: RBI: NBFC ల నుంచి లోన్లు మరింత సులభం? RBI మార్గదర్శకాలు

Breaking News Karnataka CM Change News Karnataka Political Update latest news Siddaramaiah DK Shivakumar Siddaramaiah Statement July 2025 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.