📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

జగన్ కేసులో రఘురామకు షాక్ ?

Author Icon By Vanipushpa
Updated: January 21, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ సీఎం వైఎస్ జగన్ పై సుప్రీంకోర్టులో కేసులు వేసి పోరాడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు కోర్ట్ షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన రఘురామకృష్ణంరాజు ఇదే క్రమంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఓ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రఘురామరాజు చేసిన ఓ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో రఘురామ తదుపరి అడుగులు ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జగన్ ఆస్తుల కేసులో జరుగుతున్న సుదీర్ఘ విచారణపై అభ్యంతరం చెప్తూ రఘురామ ఈ పిటిషన్ దాఖలు చేశారరు.

జగన్ పై సీబీఐ అక్రమాస్తుల కేసు నమోదు చేసి దశాబ్దం దాటిపోయింది. అయినా ఇప్పటికీ ఈ కేసులో పూర్తిస్దాయిలో ఛార్జిషీట్లు దాఖలు అయి విచారణ పూర్తి కాలేదు. ఈ లోపే పదుల సంఖ్యలో వచ్చి పడుతున్న డిశ్చార్జ్ పిటిషన్లను తేల్చలేక హైదరాబాద్ సీబీఐ కోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా చేతులెత్తేస్తున్న పరిస్దితి. అలాగే డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పులు ఇచ్చేందుకు సిద్ధమైన క్రమంలో ఐదుగురు సీబీఐ కోర్టు న్యాయమూర్తులు బదిలీ అయి వెళ్లిపోయారంటూ తాజాగా రఘురామ లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
సుప్రీం ఆదేశాల మేరకు హైకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరుగుతున్నా ఫలితం లేదని తెలిపారు. ఇదంతా చూస్తుంటే జగన్ తో సీబీఐ కుమ్మక్కు అయినట్లు కనిపిస్తోందని, కాబట్టి జగన్ అక్రమాస్తుల కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును రఘురామ లాయర్లు కోరారు. అయితే దీనికి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరుపుతున్న జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం అంగీకరించలేదు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో సాగుతున్న ఈ కేసుల విచారణ అక్కడే జరగనివ్వాలని సూచించారు. దీంతో రఘురామ లాయర్లు వెనక్కి తగ్గారు.

raghurama krishna raju Supreme Court YS Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.