📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Latest Telugu News : Shashi Tharoor : హ‌సీనాకు మరణశిక్ష విధించడం చాలా ఆందోళనకరం శ‌శిథ‌రూర్

Author Icon By Sudha
Updated: November 18, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఆ దేశానికి చెందిన‌ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ మ‌ర‌ణ‌శిక్ష విధించ‌డంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. హ‌సీనాకు మరణశిక్ష విధించడం చాలా ఆందోళనకరమని పేర్కొన్నారు. థ‌రూర్ (Shashi Tharoor)మీడియాతో మాట్లాడుతూ.. హ‌సీనాకు మరణశిక్ష విధించడం సరైందని తాను భావించ‌డం లేదన్నారు. ఏ కేసులో అయినా ప్రతిఒక్కరికీ తమను తాము సమర్థించుకుంటూ వాదించే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఇలాంటి మరణశిక్ష విధించాలని అభిప్రాయ‌ప‌డ్డారు. వేరే దేశానికి చెందిన న్యాయవ్యవస్థ, అంతర్గత విషయాలపై తాను వ్యాఖ్యానించడం సరైనది కాదని, కానీ తాజా తీర్పు చాలా ఆందోళనకరంగా ఉందని అన్నారు.

Read Also : http://Bihar Results: ‘ఇది మా కుటుంబ వ్యవహారం’: లాలూ ప్రసాద్ యాదవ్

Shashi Tharoor

గత ఏడాది బంగ్లాదేశ్‌లో స్వాతంత్య్ర పోరాట వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. ఇది చివరకు దేశవ్యాప్త తిరుగుబాటుకు దారితీసింది. ఈ నిరసనల నేపథ్యంలో హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చారు. అనంతరం బంగ్లాలో మహ్మద్‌యూనస్‌ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. స్వదేశంలో జరిగిన ఆందోళనల‌ను అణిచివేసేందుకు హ‌సీనా అమాన‌వీయంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆమెపై కేసులు నమోదయ్యాయి. దీనిపై తాజాగా విచారణ జరిపిన ఐసీటీ.. హసీనాను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో హసీనాను తమకు అప్పగించాలంటూ యూనస్‌ ప్రభుత్వం భారత్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ తీర్పును హసీనా పక్షపాతమ‌ని, రాజకీయ ప్రేరేపితమని అన్నారు.

శశి థరూర్ ఎవరు?

శశి థరూర్ జననం 9 మార్చి 1956) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ప్రజా మేధావి, మాజీ దౌత్యవేత్త మరియు అధికారి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన ఆయన 2009 నుండి కేరళలోని తిరువనంతపురం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Breaking News death sentence Hasina Human Rights India Politics latest news Shashi Tharoor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.