📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

స‌నాత‌న ధ‌ర్మ‌ర‌క్ష‌ణ‌కు శంక‌రాచార్యుల తీర్మానాలు

Author Icon By Vanipushpa
Updated: January 29, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న కుంభ‌మేళా సంద‌ర్భంగా.. దేశంలోని హిందూ ధ‌ర్మాల‌కు చెందిన ముగ్గురు శంక‌రాచార్యులు భేటీ అయ్యారు. ఆ చ‌రిత్రాత్మ‌క భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో వాళ్లు సంయుక్త ప్ర‌క‌ట‌న జారీ చేశారు. స‌నాత‌న ధ‌ర్మ‌ర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. గో వ‌ధ‌ను ఆపేయాల‌ని ధ‌ర్మాదేశం ఇచ్చారు. గోవును దేశ‌మాత‌గా ప్ర‌క‌టించాల‌ని తీర్మానించారు. దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌.. స‌నాత‌న సంప్ర‌దాయ ప‌రిర‌క్ష‌ణ‌కు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌ను పేర్కొన్నారు. కుంభ‌మేళా స‌మ‌యంలో ప్ర‌యాగ్‌రాజ్‌ను విజిట్ చేయాల‌ని స‌నాత‌న ధ‌ర్మ ఫాలోవ‌ర్ల‌కు శంక‌రాచార్యులు పిలుపునిచ్చారు.
మూడు ప్ర‌ముఖ పీఠాల‌కు చెందిన శంక‌రాచా ర్య‌లు భేటీ కావ‌డం ఇదే మొద‌టిసారి. శృంగేరి శార‌దా పీఠంకు చెందిన విధు శేఖ‌ర భార‌తి, ద్వారకా శార‌దా పీఠానికి చెందిన స‌దానంద స‌ర‌స్వ‌తి, జ్యోతిర్ మ‌ఠానికి చెందిన అవిముక్తేశ్వ‌రానంద స‌ర‌స్వ‌తి ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

ముగ్గ‌రు శంక‌రాచార్య‌లు సంయుక్తంగా ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. స‌నాత‌న సంస్కృతి వృద్ధి, ర‌క్ష‌ణ‌పై 27 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేశారు. సంస్కృత భాష ప్రాముఖ్య‌త‌పై దృష్టి పెట్టాల‌ని శంక‌రాచార్య స‌దానంద స‌ర‌స్వ‌తి తెలిపారు. గోవును దేశ‌మాత‌గా గుర్తించాల‌ని కోరుతూ శృంగేరి పీఠాధిప‌తి విధు శేఖ‌ర భార‌తి తెలిపారు. సంస్కృత విద్య ప్ర‌మోష‌న్ కోసం కేంద్రం నిధుల్ని కేటాయించాల‌ని అవిముక్తేశ్వ‌రానంద స‌ర‌స్వ‌తి తెలిపారు. న‌దులు, కుటుంబ వ్య‌వ‌స్థ‌ సంర‌క్ష‌ణ గురించి శంక‌రాచార్యులు ప్ర‌క‌ట‌న చేశారు.

maha kumbamela Resolutions sanatana dharma Shankaracharya's

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.