సాధారణంగా భోజనాన్ని స్టీల్ ప్లేట్లలో వడ్డిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లోని మధ్యాహ్న భోజనం సమయంలో వారికి ఆహారం అందించేందుకు కూడా ఇవే ప్లేట్లను వాడతారు. సర్కారు ఇవ్వడమో లేక దాతలు ప్లేట్లను అందించడమో చేస్తుంటారు. ఇవేవీ కుదరకపోతే నేరుగా విద్యార్థులే పుస్తకాలతో పాటు ఓ ప్లేటును వెంట తీసుకెళ్తుంటారు. ఇప్పటి వరకు మనం ఇలాంటివి చాలానే చూశాం. ఇంకా ప్రభుత్వ బడుల్లో చదివిన వారైతే దీన్ని అనుభవించే ఉంటారు. (School) కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ సర్కారు బడి మాత్రం మధ్యాహ్నం భోజనాన్ని ఏకంగా చిరిగిన చిత్తు కాగితాల్లో వడ్డించింది. స్టీల్ ప్లేట్లు లేకపోతే లేకపాయె కానీ కనీసం ప్లాస్టిక్ ప్లేట్లైనా వీరికి కోసం వాడలేదు. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం నాడే విద్యార్థులను ఇలా అవమానించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Read Also: Parliament Updates: ప్రారంభమైన అఖిలపక్ష భేటీ
కాగితాలే ప్లేట్లు
మైహార్ జిల్లా భట్గవాన్ గ్రామ (Maihar district) ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిబంధనల ప్రకారం జనవరి 26వ తేదీన విద్యార్థులకు పూరీ, హల్వాతో కూడిన ప్రత్యేక భోజనం వడ్డించాలి. (School) అయితే స్కూల్ యాజమాన్యం చిన్నారులకు కనీసం విస్తరాకులు కూడా ఇవ్వకుండా పాత నోట్బుక్కుల నుంచి చించిన పేజీలను వారి ముందు పరిచింది. వేడి వేడి హల్వా, పూరీలను నేరుగా ఆ కాగితాలపైనే వడ్డించారు. ఈ వేడికి పేపర్ల మీద ఉన్న సిరా రంగు పూరీ, హల్వాలకు అంటుకుపోయింది. అయినా చిన్నారులు వాటిని తిన్నారు. ఇంకుతో పాటు దుమ్ము, ధూళి కూడా ఆహారం చేరింది. అది అధికారులు చూసినప్పటికీ ఏమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్లేట్లు కొనడానికి ప్రభుత్వం ఇప్పటికే నిధులను విడుదల చేసింది. కానీ ఆ నిధులు ఏమయ్యాయి? పాఠశాలలో ఒక్క ప్లేటు కూడా ఎందుకు అందుబాటులో లేదు? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియో చూసిన వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: