SBI Alert : డిసెంబర్ 1 నుంచి ఎస్బిఐ కస్టమర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కీలక సమాచారం…

Read Time:  1 min
SBI Alert
SBI Alert
FONT SIZE
GET APP

SBI Alert : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరోసారి ముఖ్య హెచ్చరిక ఇచ్చింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి బ్యాంక్ ఒక ప్రధాన డిజిటల్ సర్వీస్‌ను పూర్తిగా నిలిపివేయబోతోంది. ఇప్పటివరకు డిజిటల్ లావాదేవీలలో విస్తృతంగా ఉపయోగించే mCASH సేవలు ఇకపై వినియోగదారులకు అందుబాటులో ఉండవు.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకైన ఎస్బిఐ ప్రకటించిన ప్రకారం, 2025 నవంబర్ 30 తర్వాత OnlineSBI మరియు YONO Lite ప్లాట్‌ఫార్మ్‌లలో mCASH సేవను శాశ్వతంగా (SBI Alert) నిలిపివేస్తున్నారు. దీంతో డిసెంబర్ 1వ తేదీ నుంచి మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ఆధారంగా బెనిఫిషియరీని ముందుగా జోడించకుండా డబ్బు పంపించే అవకాశం పూర్తిగా రద్దవుతుంది.

ఇప్పటివరకు mCASH లింక్ లేదా మొబైల్ యాప్ ద్వారా డబ్బులు రిసీవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇకముందు ఉండదు. కనుక ఈ ఫీచర్‌పై ఆధారపడుతున్న ఖాతాదారులు తప్పనిసరిగా ఇతర చెల్లింపు మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Read also: CII summit 2025: ఏపీలో పెట్టుబడి పెట్టనున్న Hwaseung కంపెనీ

ఎస్బిఐ సూచించిన ప్రత్యామ్నాయాలు:

  • UPI
  • IMPS
  • NEFT
  • RTGS

mCASH అనేది SBI కస్టమర్లు (SBI Alert) ఎక్కువగా ఉపయోగించే ఫీచర్. ఈ సర్వీసుతో లబ్ధిదారుని ముందుగా రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం వారి మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌తోనే డబ్బులు పంపడం సాధ్యమయ్యేది. డబ్బు పంపిన వెంటనే ఒక లింక్‌తో పాటు 8 అంకెల పాస్‌కోడ్ జారీ అవుతుండేది. అకౌంట్ నంబర్, IFSC, పాస్‌కోడ్ వంటి వివరాలు నమోదు చేసిన తర్వాత మొత్తం వెంటనే వారి ఖాతాలో జమ అయ్యేది.

mCASH నిలిపివేయడానికి బ్యాంక్ స్పష్టమైన కారణం వెల్లడించకపోయినా, డిజిటల్ పేమెంట్ వ్యవస్థలలో వచ్చే మార్పులు, యూపీఐ వినియోగంలో భారీ పెరుగుదల, భద్రతా ప్రమాణాల పెంపు వంటి అంశాలు ఈ నిర్ణయానికి దారితీశినట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తంగా, 2025 నవంబర్ 30 తర్వాత mCASH పూర్తిగా నిలిచిపోతుంది. (SBI Alert)
అందువల్ల ఎస్బిఐ కస్టమర్లు ఇకపై డబ్బుల పంపిణీ కోసం ఇతర మార్గాలను తప్పనిసరిగా ఉపయోగించాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.