📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Latest Telugu news : Savitri Jindal : దేశంలో అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా సావిత్రి జిందాల్‌

Author Icon By Sudha
Updated: October 9, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌లో అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా మరోసారి ఓపీ జిందాల్ గ్రూపు ఓన‌ర్‌ సావిత్రి జిందాల్ (Savitri Jindal) నిలిచారు. భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్‌ నిలిచారు. అంతేకాదు, టాప్ 10 భార‌త బిలియ‌నీర్లలో ఉన్న ఏకైక మ‌హిళ ఆమే కావ‌డం విశేషం.ఫోర్బ్స్‌ విడుదల చేసిన జాబితాలో ముకేశ్‌ అంబానీ 105 బిలియన్ డాలర్లతో ఫస్ట్‌ ప్లేస్‌ను సొంతం చేసుకోగా, 92 బిలియన్‌ డాలర్లతో గౌతమ్ అదానీ ( రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత సావిత్రి జిందాల్ (Savitri Jindal) 40 బిలియన్‌ డాలర్లతో మూడోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఆమె సంపద 3.5 బిలియన్‌ డాలర్లు తగ్గింది. అయినప్పటికీ భారత్‌లోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్‌ కొనసాగుతున్నారు.

Savitri Jindal : దేశంలో అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా సావిత్రి జిందాల్‌

భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ పేరు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సావిత్రి జిందాల్‌..(Savitri Jindal) ఓపీ జిందాల్ గ్రూపు ఓన‌ర్‌గా ఉన్నారు. జిందాల్ గ్రూప్ భారీ వ్యాపారాన్ని ఆమె నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె హ‌ర్యానాలో ఎమ్మెల్యేగానూ కొన‌సాగుతున్నారు. స్టీల్, ప‌వ‌ర్‌, సిమెట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో జిందాల్ గ్రూపు వ్యాపారాలున్నాయి. ఆ గ్రూపున‌కు సావిత్రి చైర్మెన్‌గా కొన‌సాగుతున్నారు. ఆమె భ‌ర్త ఓం ప్రకాశ్ జిందాల్ ఆ కంపెనీ స్థాపించారు. 2005లో జ‌రిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఓపీ జిందాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న మృతి త‌ర్వాత వ్యాపారాన్ని నాలుగురు కుమారుల‌కు విభ‌జించారు. ముంబైలో ఉండే ఆమె కుమారుడు స‌జ్జన్ జిందాల్ .. జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, జేఎస్‌డ‌బ్ల్యూ సిమెంట్‌, జేఎస్‌డ‌బ్ల్యూ పెయింట్స్‌, జేఎస్‌డ‌బ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం చేస్తున్నాడు. ఎంజీ మోటారు ఇండియా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కంపెనీలో 35 శాతం వాటా తీసుకున్నారు. ఢిల్లీలో నివ‌సించే న‌వీన్ జిందాల్‌.. జిందాల్ స్టీల్, ప‌వ‌ర్ చూసుకుంటున్నారు.

జిందాల్ చరిత్ర?

జిందాల్ కుటుంబం 1952 లో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది . గ్రూప్ యొక్క మొదటి వెంచర్, జిందాల్ ఇండియా లిమిటెడ్, మైల్డ్ స్టీల్, ERW మరియు బ్లాక్ గాల్వనైజ్డ్ స్టీల్ పైపులు/గొట్టాల తయారీ కోసం హౌరాలో స్థాపించబడింది. భారతదేశంలో స్టీల్ పైపులు మరియు గొట్టాల తయారీలో జిందాల్స్ మొదటి మరియు ప్రముఖమైనవి.

సావిత్రి జిందాల్ మతం?

జిందాల్ అస్సాంలోని టిన్సుకియాలో ఒక హిందూ మార్వారీ కుటుంబంలో జన్మించారు. ఆమె 1970లలో ఓం ప్రకాష్ జిందాల్‌ను వివాహం చేసుకున్నారు, ఆయన ఉక్కు మరియు విద్యుత్ సంస్థ అయిన జిందాల్ గ్రూప్‌ను స్థాపించారు. జిందాల్ హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా మరియు హిసార్ నియోజకవర్గం నుండి హర్యానా విధాన సభ (శాసనసభ) సభ్యుడిగా ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Indian Billionaires Jindal Group latest news Richest Woman in India Savitri Jindal Telugu News Women Entrepreneurs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.