📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News telugu: Sanjay Kumar: భద్రతా కార్యకలాపాల్లో రైల్వే బోర్డు మార్గదర్శకాలు పాటించాల్సిందే :సంజయ్ కుమార్

Author Icon By Sharanya
Updated: September 16, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (తార్నాక): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సోమవారం సికింద్రాబాద్ (Secunderabad)లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, ప్రధాన విభాగాధిపతులతో కలిసి జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై వివరణాత్మక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల మొత్తం ఆరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డి.ఆర్. ఎంలు) విడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రయాణీకుల, శాఖాపరమైన భద్రతను నిర్ధారించడానికి భద్రతా విధానాలు, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం ప్రాముఖ్యత గురించి వివరించారు.

గేట్ల వద్ద అనధికార వాహనాల కదలిక పై కఠినమైన చర్యలు

ఏదైనా భద్రతా కార్యకలాపాలు చేపట్టేటప్పుడు రైల్వే బోర్డు (Railway Board)మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. లెవల్ క్రాసింగ్లు, గేట్ల వద్ద అనధికార వాహనాల కదలిక పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్లలో బ్యాటరీ ఆపరేటెడ్ కార్ల (బి.ఓ.సిలు) నిర్వహణ, క్యాంపింగ్ కోచ్లను సరిగ్గా స్థిరపరచడం మరియు రిలే గదులలో పూర్తి ఇంటర్ లాకింగ్ ప్లాన్ల నిర్వహణ కోసం భద్రతా సూచనలను పాటించాల్సిన అవసరా లపై ఆయన దృష్టి సారించారు. జనరల్ మేనేజర్ జోన్ వ్యాప్తంగా కొనసాగుతున్న భద్రతా కార్యక్రమాలను సమీక్షిస్తూ, ఇంజనీరింగ్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి వివిధ విభాగాలు చేపట్టిన పరిశీలించారు. పశువుల రన్ ఓవర్ కేసులను పర్యవేక్షించడం, ప్రైవేట్ సైడింగ్లలో సి.సి.టి.వి ఏర్పాటు, సరుకు రవాణా రైలు కార్యకలాపాలలో భద్రతా చర్యలు వంటి ముఖ్యమైన రంగాలను ఆయన పరిశీలించారు.

తనిఖీల సమయంలో గుర్తించిన ఏవైనా లోపాలను సజావుగా రైలు కార్యకలాపాలను నిర్వర్తించడానికి వెంటనే చొరవలను సరిదిద్దాలని ఆయన నొక్కి చెప్పారు. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ భద్రతా ప్రమాణాలను పెంపొందించడంపై వ్యూహాత్మక ప్రాధాన్యతనిచ్చారు. పర్యవేక్షకులు క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. సమస్యలను సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించాలని ఆదేశించారు. అదేవిదంగా భద్రతా కేటగిరీ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్సులు, కుటుంబ కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా శిక్షణ, సున్నితత్వాన్ని పెంపొందించడంతో జోన్ వ్యాప్తంగా భద్రతా సంస్కృతిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/uttar-pradesh-baby-girl-buried-alive-by-parents/national/548053/

Breaking News Indian Railways latest news railway board guidelines railway operations Railway Safety Sanjay Kumar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.