అయ్యప్ప భక్తులకు బిగ్ అప్డేట్. శబరిమల శరణుఘోషతో మారు మోగుతోంది. మకరజ్యోతి దర్శన పవిత్ర సమయం సమీపిస్తోంది. పెద్ద సంఖ్యలో భక్తులు మకరజ్యోతి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ఈ సారి పెరుగుతున్న రద్దీ వేళ ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో దర్శన కోటాలో పరిమితులు విధించారు. కొన్ని ఆంక్షలు ప్రకటించారు. ఎలాంటి సమస్యలు లేకుండా మకరజ్యోతి దర్శనం కోసం ఆలయ అధికారులు సమాయత్తం అవుతున్నారు. శబరిమలలో మకర సంక్రాంతి సాక్షాత్తు మణికంఠుడే ‘మకర జ్యోతి’గా దర్శనమిచ్చే పవిత్ర సమయం సమీపిస్తోంది. ఈసారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్శన కోటాపై ఆంక్షలు విధించారు. రద్దీని నియంత్ రించేందుకు దర్శన కోటాను అధికారులు క్రమబద్ధీకరించారు.
Read Also: Russo-Ukrainian War : ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా
ఈ నెల 13న వర్చువల్ క్యూ ద్వారా 35,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి అవకాశం కల్పించనున్నారు. అత్యంత కీలకమైన మకరజ్యోతి దర్శనం రోజున అంటే జనవరి 14న, రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన కోటాను 30 వేలకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక 15 నుంచి 18 వరకు ప్రతిరోజూ 50,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, 5,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పించారు. Also Read ఉద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక, ఉత్తర్వులు..!! జనవరి 19న తిరిగి భక్తుల సంఖ్యను 30వేలకు తగ్గిస్తూ అధికారులు తాజాగా అధికారులు నిర్ణయించారు. కాగా, ఈ రోజు పందళం నుంచి ప్రారంభమయ్యే తిరువాభరణ ఊరేగింపు 14న సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో 14న ఉదయం 10 గంటల నుండి నిలక్కల్-పంబ మార్గంలో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: