📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: RSS: భారత్ కు హాని చేయడమే పాక్ లక్ష్యం: మోహన్ భగవత్

Author Icon By Sushmitha
Updated: November 10, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని, పొరుగు దేశాలతో సఖ్యతతో మెలగాలని ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) పేర్కొన్నారు. అయితే, పొరుగు దేశమైన పాకిస్థాన్ మాత్రం మనతో శాంతియుతంగా ఉండాలని అనుకోవడం లేదని ఆయన ఆరోపించారు. భారత దేశానికి హాని కలిగించడం ద్వారానే పాక్ సంతృప్తి చెందుతుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో మనం ఎల్లప్పుడూ శాంతి కోరుకోవడం సరికాదని, పాక్‌కు అర్థమయ్యే భాషలోనే జవాబు ఇవ్వడం మంచిదని ఆయన స్పష్టం చేశారు.

Read Also: TTD: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భారీ విరాళాలు

RSS

శాంతిని కోరుకోని వారికి అశాంతిని రుచి చూపించాలి

మోహన్ భగవత్ మాట్లాడుతూ, పాకిస్థాన్‌కు నష్టం కలిగేలా ప్రతిసారీ ఓడిస్తూనే ఉండాలని చెప్పారు. అప్పుడు పాక్ శాశ్వతంగా పశ్చాత్తాపం చెందక తప్పదని అన్నారు. శాంతిని కోరుకోని వారికి అశాంతిని రుచి చూపించడం ద్వారానే బుద్ధి చెప్పాలని అన్నారు. 1971లో భారత సైన్యం ధాటికి పాకిస్థాన్ 90 వేల మంది సైనికులను కోల్పోయిందని, అయినా సరే ఆ దేశ పాలకులకు బుద్ధి రాలేదని ఆయన విమర్శించారు.

పాక్‌కు భగవత్ హితవు, దేశానికి సూచన

భారత్‌ను తాము చేయగలిగింది ఏమీలేదని పాక్‌కు అర్థమయ్యే వరకు ప్రతి దాడి చేయాలని మోహన్ భగవత్ సూచించారు. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పాక్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిజాయతీగల స్నేహితుడిగా భారత్‌కు సహకరిస్తేనే మీకు మేలు కలుగుతుందని పాకిస్థాన్‌కు ఆయన హితవు పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Cross Border Terrorism Google News in Telugu india India Pakistan Relations Latest News in Telugu Mohan Bhagwat Mohan Bhagwat Comments Pakistan RSS rss chief Telugu News Today Terrorism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.