📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. గాల్లో ఎగిరిపడి మృత్యువాత పడ్డ ప్రయాణికులు

Author Icon By Saritha
Updated: March 4, 2026 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Road Accident: Truck hits divider, passengers fly into air and die

Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న ఓ పికప్ ట్రక్కు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ప్రయాణికులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోవడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.

ఈ విషాద ఘటనలో వాహన డ్రైవర్ మురారి (25) తో పాటు, మూడేళ్ల పసి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనంలో ఉన్న మరో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: India’s Nuclear Power: అణుశక్తితో భారత్ బలోపేతం

ప్రమాదానికి కారణం నిద్రమత్తేనా?

ప్రమాద సమయంలో వాహనం అత్యంత వేగంతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారడం వల్లే స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయి, వాహనం డివైడర్‌ను ఢీకొట్టిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ట్రక్కు డివైడర్‌ను ఢీకొన్న వేగానికి ప్రయాణికులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటం చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అర్థమవుతోంది. ఈ ఘటనపై ఉన్నావ్ పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Agra-Lucknow Expressway Pickup Truck Road Accident Unnao Road Accident Uttar Pradesh Road Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.