📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Today News : Restaurant Charges : రెస్టారెంట్ల సర్వీస్ ఛార్జ్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం – డబుల్ దోపిడీ

Author Icon By Shravan
Updated: August 23, 2025 • 8:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Restaurant Charges : ఆగస్టు 16, 2025న ఢిల్లీ హైకోర్టు రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ (Devendra Kumar) ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గెడెల ధర్మాసనం, ఆహార పదార్థాలపై ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు తీసుకుంటూ మళ్లీ అదనంగా సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడం వినియోగదారులను రెట్టింపు దోపిడీకి గురి చేయడమేనని పేర్కొంది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జాతీయ రెస్టారెంట్ల సంఘం (NRAI), భారత హోటళ్లు, రెస్టారెంట్ల సమాఖ్య (ఎఫ్‌హెచ్ఆర్ఏఐ) డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సందర్భంగా ఈ విచారణ జరిగింది.

కోర్టు ప్రశ్నలు: ఆంబియన్స్ ధరలు, సర్వీస్ ఛార్జ్ అవసరమా?

ధర్మాసనం రెస్టారెంట్ల సంఘాలను సూటిగా ప్రశ్నిస్తూ, “కస్టమర్లకు మంచి అనుభూతి (ఆంబియన్స్) అందిస్తున్నారని చెబుతున్నారు. దానికోసం ఇప్పటికే ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు. రూ.20 విలువైన వాటర్ బాటిల్‌ను రూ.100కు అమ్ముతున్నారు. ఆ అదనపు రూ.80 ఆంబియన్స్ కోసమే కదా? మళ్లీ సర్వీస్ ఛార్జ్ ఎందుకు?” అని అడిగింది. ఆంబియన్స్ అందించడం సేవలో భాగమేనని, ప్రత్యేక ఛార్జ్ సరికాదని స్పష్టం చేసింది.

Restaurant Charges : రెస్టారెంట్ల సర్వీస్ ఛార్జ్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం – డబుల్ దోపిడీ

ఛార్జ్: అన్యాయమైన వాణిజ్య పద్ధతి

సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి వసూలు వినియోగదారులను బలవంతపెట్టడమేనని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. సర్వీస్ ఛార్జ్‌పై జీఎస్టీ కూడా చెల్లించాల్సి రావడం వల్ల రెట్టింపు భారం పడుతోందని, గత సింగిల్ జడ్జి తీర్పును గుర్తు చేసింది. కోర్టు ప్రేక్షకపాత్ర వహించలేమని తేల్చి చెప్పింది.

పిటిషన్ నేపథ్యం

సర్వీస్ ఛార్జ్‌ను తప్పనిసరిగా వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్ఆర్ఏఐ, ఎఫ్‌హెచ్ఆర్ఏఐ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సందర్భంగా ఈ విచారణ జరిగింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/tragedy-three-mba-students-drown-in-cheyeru-river/andhra-pradesh/534537/

Breaking News in Telugu Consumer Rights Delhi High Court double dipping India restaurants Latest News in Telugu restaurant charges service charge issue Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.