పరువు నష్టం కేసులో బాన్సురీ స్వరాజ్‌కు ఊరట

Read Time:  1 min
Relief for Bansuri Swaraj in defamation case
Relief for Bansuri Swaraj in defamation case
FONT SIZE
GET APP

పరువు నష్టం కేసును కొట్టేసిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్‌కి క్రిమినల్‌ పరువు నష్టం కేసులో ఊరట లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఆమెపై దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ అంశాన్ని విచారణలోకి తీసుకోవడానికి నిరాకరించిన అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నేహా మిత్తల్, పిటిషన్‌ను తిరస్కరించారు. 2003 అక్టోబర్ 5న జరిగిన ఓ టీవీ ఇంటర్వ్యూలో బాన్సురీ స్వరాజ్ తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని,ఆ ఇంటర్వ్యూను లక్షలాది మంది వీక్షించారని సత్యేందర్ జైన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పరువు నష్టం కేసులో బాన్సురీ

సరైన ఆధారాలు లేవు..

తన నివాసం నుంచి రూ.3 కోట్లు నగదు, 1.8 కిలోల బంగారం, 133 బంగారు నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు బాన్సురీ స్వరాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా, రాజకీయ ప్రయోజనం కోసం అవినీతిపరుడు, మోసగాడు అంటూ ఆమె తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేశారని జైన్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా ఈ కేసును విచారించిన ఢిల్లీ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.. సరైన ఆధారాలులేవన్న కారణంగా పరువు నష్టం పిటిషన్‌ను కొట్టివేశారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.