News Telugu: RBI: ప్రపంచస్థాయి బ్యాంకులకు సిద్ధమవుతున్న భారత్: నిర్మలా సీతారామన్

Read Time:  1 min
RB
RB
FONT SIZE
GET APP

RBI: భారత ప్రభుత్వం ప్రపంచస్థాయి బ్యాంకులను నిర్మించడానికి రెడీ అవుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ (Nirmala sitharaman) వెల్లడించారు. ముంబైలో నవంబరు 6న జరిగిన 12వ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాన్లేవ్ లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ప్రభుత్వం రుణదాతలతో కూర్చుని చర్చలు జరుపుతుంది. వారు పెద్ద బ్యాంకులుగా ఎలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో తెలుసుకుంటున్నాం. ఈ అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)తో కూడా చర్చలు కొనసాగుతాయని తెలిపారు. పెద్ద బ్యాంకులతో ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై ప్రణాళిక నేను అవును అని చెప్పే ముందు చాలా పని చేయాల్సి ఉంది.

Read also: Latest News: Recharge: రీఛార్జ్‌ రేట్లు మళ్లీ పెరగనున్నాయా?  

RB

RBI: ప్రపంచస్థాయి బ్యాంకులకు సిద్ధమవుతున్న భారత్

సీతారామన్ ప్రధాన ఉద్దేశ్యం

కానీ ఆ దిశలో పని ఇప్పటికే ప్రారంభమైందని చెప్పగలను అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ రంగ బ్యాంకుల రెండవ దశ విలీనాలు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్ 15న మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, చిన్న, మధ్యస్థాయి ప్రభుత్వ బ్యాంకులను పెద్ద బ్యాంకులతో విలీనం చేసే ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తోంది. బ్యాంకింగ్ రంగాన్ని బలపరచడమే ప్రధాన ఉద్దేశం: నిర్మలా సీతారామన్ ప్రధాన ఉద్దేశ్యం బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలపరచడం, పరిమిత సంఖ్యలో అయినా స్థిరమైన, ప్రపంచస్థాయి సంస్థలను నిర్మించడం. ఈ ప్రతిపాదనల ప్రకారం.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఒబి), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) వంటి పెద్ద బ్యాంకులతో విలీనం చేయవచ్చని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

    Rajitha

    రచయిత గురించి

    Rajitha

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.