జూన్ 21 – అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా మధురైలోని వెలమ్మాల్ విద్యా సంస్థలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన ఫిట్నెస్ ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 73 సంవత్సరాల వయసులోనూ ఆయన వరుసగా 51 పుషప్స్ తీసి అనుసరణీయ ఉదాహరణగా నిలిచారు. గవర్నర్ చేస్తున్న పుషప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎన్ రవి (Ravindra Narayana Ravi), కేవలం మాటల్లోనే కాకుండా తన చర్యల ద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఆయన శక్తివంతమైన శరీరాన్ని, మానసిక దృఢత్వాన్ని ప్రదర్శిస్తూ వేదికపై ప్రవేశించి, ఏకబిగిన పుషప్స్ తీసారు.
ఆయన శారీరక దృఢత్వం వెనుక ఉన్న క్రమశిక్షణ
మాజీ ఐపీఎస్ అధికారి అయిన రవీంద్ర నారాయణ్ రవి, 1976లో కేరళ కేడర్కి చెందిన ఐపీఎస్గా తన సేవా జీవితాన్ని ప్రారంభించారు. 2021లో రవీంద్ర తమిళనాడు గవర్నర్గా నియమితులయ్యారు. 73 ఏళ్ల వయసులో ఆయన ఏకబిగిన 51 పుషప్స్ తీసి అందరినీ ఆచ్చర్యనికి గురిచేశారు. ఆయన ఉత్సాహంగా పుషప్స్ చేస్తుండగా, అక్కడున్నవారంతా చప్పట్లతో అభినందించారు. గవర్నర్ తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ ఐపీఎస్ అధికారి అయిన రవి, తన శిక్షణ కాలం నాటి క్రమశిక్షణను గుర్తుచేస్తూ ప్రతి యోగాసనాన్ని ఎంతో కచ్చితత్వంతో వేసి చూపించారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ తాను ముందుంటానని ఆయన తన చర్యల ద్వారా స్పష్టం చేశారు.
నెటిజన్ల ప్రశంసలు
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యాక నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. “వామ్మో, 73 ఏళ్ల వయసులో ఇంత ఫిట్గా ఉన్నారేంటి?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు “మీది మామూలు బాడీ కాదు సార్” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని గవర్నర్ నిరూపించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Read also: Honeymoon Murder: రఘువంశీ హంతకులని పట్టించిన చిరిగిన రూ.10 నోటు
Coimbatore: నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన పులి..ఆచూకీ కోసం గాలింపు