Rajya Sabha News: కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన (Privilege Committee) నోటీసులు జారీ అయ్యాయి. గత శీతాకాల సమావేశాల సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది. ఈ నెల 23వ తేదీ లోపు తన వివరణను సమర్పించాలని కమిటీ స్పష్టం చేసింది.
Read Also: PM Modi: డేటా సెంటర్లతో భారీ ఉపాధి

వివాదం నేపథ్యం
శీతాకాల పార్లమెంట్ సమావేశాల సమయంలో రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కను కారులో పార్లమెంట్ ప్రాంగణానికి తీసుకువచ్చారు. దీనిపై కొందరు ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, “సభ లోపల కూర్చున్నవారే కరుస్తారు, కుక్కలు కరవవు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
బీజేపీ ఫిర్యాదు
రేణుకా చౌదరి వ్యాఖ్యలు సభా గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ బీజేపీ ఎంపీలు బ్రిజ్లాల్, ఇందు బాలగోస్వామి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కమిటీ, ఆమెకు నోటీసులు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: