📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Rajnath Singh – యుద్ధాల్లో సాంకేతికత పెరిగింది.. ఇది మనకు ఆందోళన కలిగించే విషయం : రాజ్‌నాథ్‌ సింగ్‌

Author Icon By Sudha
Updated: October 1, 2025 • 4:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత రక్షణరంగంలో పరిశోధనను, అభివృద్ధిని బలోపేతం చేయడానికి వినూత్న వ్యవస్థ (Innovative system)ను వృద్ధిచేస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) చెప్పారు. ‘డిఫెన్స్‌ అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌’ 278వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత యుద్ధాల్లో ఆధునిక సాంకేతికత బాగా పెరిగిందని, ఇది మనకు ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు.

Rajnath Singh – యుద్ధాల్లో సాంకేతికత పెరిగింది.. ఇది మనకు ఆందోళన కలిగించే విషయం : రాజ్‌నాథ్‌ సింగ్‌

కొత్తగా వస్తున్న సాంకేతికతలు ఏళ్లుగా జరిగిన పరిశోధన, అభివృద్ధి ఆధారంగా రూపొందించినవని రాజ్‌నాథ్‌ (Rajnath Singh) చెప్పారు. ఆ సాంకేతికతలను మనం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయని, భద్రతా అవసరాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. అందుకే రక్షణ బడ్జెట్ కూడా ఏటా పెరుగుతుందని అన్నారు. బడ్జెట్‌ పెరుగుదలతో దాన్ని తెలివిగా ఉపయోగించాల్సిన బాధ్యత రెట్టింపు అయ్యిందన్నారు. రక్షణరంగంలో సాంకేతిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి (Rajnath Singh) చెప్పారు. మన సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిధులు పెంచుతున్నట్లు తెలిపారు.

భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా జరుపుకుంటుంది?

రక్షణ మంత్రిత్వ శాఖ 2025 ను ‘సంస్కరణల సంవత్సరం’గా ప్రకటించింది. ఈ ప్రకటనలు సాయుధ దళాలను బహుళ-డొమైన్ సమగ్ర కార్యకలాపాలను నిర్వహించగల సాంకేతికంగా అభివృద్ధి చెందిన పోరాట-సన్నద్ధ శక్తిగా ఆధునీకరించడం మరియు కొనసాగుతున్న మరియు భవిష్యత్తు సంస్కరణలకు ఊతం ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

2025 లో DRDO సంస్కరణలు ఏమిటి?

జూన్ 2025లో, DRDO భారత సాయుధ దళాలకు అత్యవసర సేకరణ కోసం రూపొందించిన మరియు అభివృద్ధి చేసిన 28 ఆయుధ వ్యవస్థల కోసం ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది, ఇందులో వివిధ రకాల DRDO రూపొందించిన మరియు అభివృద్ధి చేసిన క్షిపణులు మరియు మందుగుండు సామగ్రి ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Defense Minister India military latest news modern warfare Rajnath Singh Telugu News war technology

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.